బ్రెజిల్ ప్రధాని జైర్ బొల్సొనారోకు వ్యతిరేకంగా ఆ దేశంలో వరుసగా రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేశారు. బొల్సొనారోపై అభిశంసన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల కార్లతో రాజధాని రియో డి జెనీరో వీధులు మోతెక్కాయి.
![thousands-take-to-streets-protesting-brazils-bolsonaro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367517_10367517vlcsnap-2021-01-25-03h07m01s136.png)
కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో వసతుల కొరత తీవ్రంగా ఉందని నిరసనకారులు ఆరోపించారు. దేశంలో రాజకీయ పరిస్థితిని మార్చేందుకు అభిశంసన ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గమని అన్నారు.
![thousands-take-to-streets-protesting-brazils-bolsonaro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367517_vlcsnap-2021-01-25-03h07m12s629.png)