ETV Bharat / international

మార్స్​పైకి వెళ్లాలా? ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా... - వ్యోమగాములను నియమించుకోవాలని నాసా నిర్ణయించింది

అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో భవిష్యత్​లో​ అవసరమయ్యే వ్యోమగాములను నియమించుకోవాలని నాసా నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 2030లో చంద్రుడు, అంగారక గ్రహంపైకి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను పంపనుంది నాసా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బృందంలో కొత్తగా నియామకం కానున్న వారిని చేర్చనుంది.

Space explorers wanted: NASA seeks next generation of astronauts
'మార్స్​పైకి వెళ్లేందుకు వ్యోమగాములు కావలెను'
author img

By

Published : Feb 12, 2020, 3:53 PM IST

Updated : Mar 1, 2020, 2:29 AM IST

భవిష్యత్తు అంతరిక్షపరిశోధనలకు అనుగుణంగా వ్యోమగాముల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాసా ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో ప్రస్తుతం 48 మంది ఉండగా.. ఆ సంఖ్యను మరింత పెంచుకోనున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ పేర్కొంది.

20వ వార్షికోత్సవం..

ఈ ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​) 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష కార్యకలాపాలను మరింత విస్తృత పర్చాలని నిర్ణయించిన నాసా దరఖాస్తులను ఆహ్వానించింది. 2024 నాటికి రెండు విడతల్లో ఓ మహిళ, ఓ పురుషుడిని చంద్రుడిపైకి పంపనున్నట్లు నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​ ప్రకటించారు.

"అత్యంత ప్రతిభావంతులైన మహిళలు, పురుషులను వ్యోమగామి దళంలో చేరడానికి ఆహ్వానిస్తున్నాం. అర్హత గల అమెరికన్ల నుంచి దరఖాస్తులను కోరుతున్నాం. మార్చి 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు అవసమైన శిక్షణ ఉంటుంది."-నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​

2030లో చంద్రుడు, అంగారకుడిపై విస్తృతమైన పరిశోధనలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను తమ సొంత రాకెట్లు ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది నాసా. అప్పుడు పంపే వ్యోమగాముల బృందంలో నూతనంగా ఎంపికయ్యే వారిని చేర్చనున్నారు.

భవిష్యత్తు అంతరిక్షపరిశోధనలకు అనుగుణంగా వ్యోమగాముల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాసా ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో ప్రస్తుతం 48 మంది ఉండగా.. ఆ సంఖ్యను మరింత పెంచుకోనున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ పేర్కొంది.

20వ వార్షికోత్సవం..

ఈ ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​) 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష కార్యకలాపాలను మరింత విస్తృత పర్చాలని నిర్ణయించిన నాసా దరఖాస్తులను ఆహ్వానించింది. 2024 నాటికి రెండు విడతల్లో ఓ మహిళ, ఓ పురుషుడిని చంద్రుడిపైకి పంపనున్నట్లు నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​ ప్రకటించారు.

"అత్యంత ప్రతిభావంతులైన మహిళలు, పురుషులను వ్యోమగామి దళంలో చేరడానికి ఆహ్వానిస్తున్నాం. అర్హత గల అమెరికన్ల నుంచి దరఖాస్తులను కోరుతున్నాం. మార్చి 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు అవసమైన శిక్షణ ఉంటుంది."-నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​

2030లో చంద్రుడు, అంగారకుడిపై విస్తృతమైన పరిశోధనలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను తమ సొంత రాకెట్లు ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది నాసా. అప్పుడు పంపే వ్యోమగాముల బృందంలో నూతనంగా ఎంపికయ్యే వారిని చేర్చనున్నారు.

Last Updated : Mar 1, 2020, 2:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.