ప్రభుత్వ యంత్రాంగంలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు మరో 11 మందిని నామినేట్ చేయాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వీరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కూడా స్థానం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.
భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండే నామినీల జాబితాలో ఉన్నారు. నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్గా రాహుల్ గుప్తా, బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా అతుల్ గవాండే నామినీలుగా ఉన్నారు.
ఇదీ చదవండి : కమల స్ఫూర్తితో భారతీయ అమెరికన్లపై పుస్తకం!