ETV Bharat / international

దటీజ్ మోదీ... వైట్​హౌస్​ కూడా ఆయనకు ఫాలోవరే!

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం... తన ట్విట్టర్​ ఖాతాలో అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు. కరోనాపై పోరాడుతున్న అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా అవసరమైన ఔషధాలు అందించడానికి భారత్​ ముందుకొచ్చిన నేపథ్యంలో... మోదీని ఫాలో కావడం ప్రారంభించింది వైట్​హౌస్.

author img

By

Published : Apr 10, 2020, 7:45 PM IST

PM Modi becomes only world leader to be followed by WH on Twitter
శ్వేతసౌధం అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేత మోదీ!

భారత్​-అమెరికా మైత్రిని నూతన శిఖరాలకు చేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం... తన ట్విట్టర్​ ఖాతాలో అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు.

భారత్​ను అనుసరిస్తోంది..!

శ్వేతసౌధం తన ట్విట్టర్ ఖాతాలో మొత్తం 19 మందిని అనుసరిస్తోంది. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉన్నారు. విశేషం ఏమిటంటే శ్వేతసౌధం అనుసరిస్తున్న అమెరికాయేతర నాయకులు వీరిద్దరు మాత్రమే.

అంతే కాకుండా, వైట్​హౌస్​ భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని, వాషింగ్టన్​లో భారత రాయబార కార్యాలయాన్ని కూడా ట్విట్టర్​లో అనుసరిస్తోంది.

PM Modi becomes only world leader to be followed by WH on Twitter
శ్వేతసౌధం అనుసరిస్తున్న విదేశీ నేత మోదీ!

ఔషధ సాయం తరువాత..

కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్న అమెరికాను రక్షించుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మోదీకి నేరుగా ఫోన్​ చేసి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించిన భారత్​... ఔషధాల ఎగుమతికి అంగీకరించింది.

భారత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ట్రంప్... 'భారతదేశం చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేము' అని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో... తమను ఆపత్కాలంలో ఆదుకున్న భారత్​పై అగ్రరాజ్యం అభిమానాన్ని చాటుకుంటోంది.

భారత్​పై ప్రశంసల వర్షం

కరోనాపై పోరులో తమకు అండగా నిలబడిన భారత్​పై... బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ సహా పలువురు ప్రపంచ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి: లక్షకు చేరువగా కరోనా మరణాలు.. స్పెయిన్​లో తగ్గుముఖం

భారత్​-అమెరికా మైత్రిని నూతన శిఖరాలకు చేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం... తన ట్విట్టర్​ ఖాతాలో అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు.

భారత్​ను అనుసరిస్తోంది..!

శ్వేతసౌధం తన ట్విట్టర్ ఖాతాలో మొత్తం 19 మందిని అనుసరిస్తోంది. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉన్నారు. విశేషం ఏమిటంటే శ్వేతసౌధం అనుసరిస్తున్న అమెరికాయేతర నాయకులు వీరిద్దరు మాత్రమే.

అంతే కాకుండా, వైట్​హౌస్​ భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని, వాషింగ్టన్​లో భారత రాయబార కార్యాలయాన్ని కూడా ట్విట్టర్​లో అనుసరిస్తోంది.

PM Modi becomes only world leader to be followed by WH on Twitter
శ్వేతసౌధం అనుసరిస్తున్న విదేశీ నేత మోదీ!

ఔషధ సాయం తరువాత..

కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్న అమెరికాను రక్షించుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మోదీకి నేరుగా ఫోన్​ చేసి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించిన భారత్​... ఔషధాల ఎగుమతికి అంగీకరించింది.

భారత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ట్రంప్... 'భారతదేశం చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేము' అని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో... తమను ఆపత్కాలంలో ఆదుకున్న భారత్​పై అగ్రరాజ్యం అభిమానాన్ని చాటుకుంటోంది.

భారత్​పై ప్రశంసల వర్షం

కరోనాపై పోరులో తమకు అండగా నిలబడిన భారత్​పై... బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ సహా పలువురు ప్రపంచ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి: లక్షకు చేరువగా కరోనా మరణాలు.. స్పెయిన్​లో తగ్గుముఖం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.