ETV Bharat / international

ఫ్లాయిడ్​ కుటుంబీకులకు రూ.196 కోట్ల నష్టపరిహారం! - rasicm in america

జార్జి ఫ్లాయిడ్​ మృతి పట్ల అతని కుటుంబసభ్యులు వేసిన దావాపై మినియాపొలిస్​ కౌన్సిల్​ కీలక ప్రకటన చేసింది. బాధిత కుటుబానికి 27 మిలియన్ డాలర్ల(సుమారు రూ.196 కోట్లు) నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని తెలిపింది.

george flyod
జార్జి ఫ్లాయిడ్​ కుటుంబీకులకు నష్టపరిహారం
author img

By

Published : Mar 13, 2021, 5:42 AM IST

అమెరికాలోని మినియాపొలిస్‌లో గతేడాది మృతిచెందిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ కేసులో పురోగతి లభించింది. ఫ్లాయిడ్​ కుటుంబసభ్యులకు నష్టపరిహారాన్ని అందించేందుకు మినియాపొలిస్‌​ యంత్రాంగం అంగీకరించింది. మొత్తం 27 మిలియన్ డాలర్లను(సుమారు రూ.196 కోట్లు) నష్టపరిహారంగా చెల్లిస్తామని శుక్రవారం ప్రకటించింది. అందులో 5 లక్షల డాలర్లను ఫ్లాయిడ్​ను అరెస్ట్​ చేసిన ప్రాంతానికి కేటాయిస్తామని పేర్కొంది.

గతేడాది మే 25న.. పోలీస్​ ఆఫీసర్ డెరెక్​ చౌవిన్​ చేతిలో జార్జి ఫ్లాయిడ్​ మరణించాడు. మెడపై కాలును గట్టిగా అదిమిపట్టడం వల్ల ఫ్లాయిడ్ మృతి చెందాడు. ఈ ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

ఫ్లాయిడ్​ మృతిని నిరసిస్తూ అతని కుటుంబసభ్యులు జూలైలో పౌర హక్కుల దావాను దాఖలు చేశారు. మినియాపొలిస్‌ పాలనా​ యంత్రాంగం సహా నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులపై ఈ వ్యాజ్యం వేశారు. ఫ్లాయిడ్​ హక్కులకు పోలీసులు భంగం కలిగించారని, వారి వైఖరికి కారణం.. పాలన యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ దావాపై కోర్టు వెలుపల పరిష్కారానికే మొగ్గు చూపిన మినియాపొలిస్‌​ కౌన్సిల్​.. ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే న్యాయస్థానంలో మాత్రం చౌవిన్​పై నమోదైన కేసు విచారణ యథావిధిగా కొనసాగనుంది.

ఇదీ చదవండి : అమెరికా తిరిగి అమేయ శక్తిగా ఎదుగుతోంది: బైెడెన్​

అమెరికాలోని మినియాపొలిస్‌లో గతేడాది మృతిచెందిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ కేసులో పురోగతి లభించింది. ఫ్లాయిడ్​ కుటుంబసభ్యులకు నష్టపరిహారాన్ని అందించేందుకు మినియాపొలిస్‌​ యంత్రాంగం అంగీకరించింది. మొత్తం 27 మిలియన్ డాలర్లను(సుమారు రూ.196 కోట్లు) నష్టపరిహారంగా చెల్లిస్తామని శుక్రవారం ప్రకటించింది. అందులో 5 లక్షల డాలర్లను ఫ్లాయిడ్​ను అరెస్ట్​ చేసిన ప్రాంతానికి కేటాయిస్తామని పేర్కొంది.

గతేడాది మే 25న.. పోలీస్​ ఆఫీసర్ డెరెక్​ చౌవిన్​ చేతిలో జార్జి ఫ్లాయిడ్​ మరణించాడు. మెడపై కాలును గట్టిగా అదిమిపట్టడం వల్ల ఫ్లాయిడ్ మృతి చెందాడు. ఈ ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

ఫ్లాయిడ్​ మృతిని నిరసిస్తూ అతని కుటుంబసభ్యులు జూలైలో పౌర హక్కుల దావాను దాఖలు చేశారు. మినియాపొలిస్‌ పాలనా​ యంత్రాంగం సహా నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులపై ఈ వ్యాజ్యం వేశారు. ఫ్లాయిడ్​ హక్కులకు పోలీసులు భంగం కలిగించారని, వారి వైఖరికి కారణం.. పాలన యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ దావాపై కోర్టు వెలుపల పరిష్కారానికే మొగ్గు చూపిన మినియాపొలిస్‌​ కౌన్సిల్​.. ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే న్యాయస్థానంలో మాత్రం చౌవిన్​పై నమోదైన కేసు విచారణ యథావిధిగా కొనసాగనుంది.

ఇదీ చదవండి : అమెరికా తిరిగి అమేయ శక్తిగా ఎదుగుతోంది: బైెడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.