ETV Bharat / international

అమెరికాలో మూడో టీకాకు ఎఫ్​డీఏ ఆమోదం

author img

By

Published : Feb 28, 2021, 6:34 AM IST

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోసు టీకాకు అమెరికా ఎఫ్​డీఐ ఆమోదం తెలిపింది. తీవ్రమైన కొవిడ్​కు వ్యతిరేకంగా 85 శాతం సమర్థతతో వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు ఎఫ్​డీఐ పేర్కొంది. ఈ టీకాను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు.

Johnson & Johnson
సింగిల్ డోసు టీకాకు అమెరికా ఆమోదం

అమెరికాలో మూడో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకే డోసుతో కరోనాను నివారించేలా జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ(ఎఫ్​డీఏ) నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.

85 శాతం సమర్థత!

వైరస్​కు వ్యతిరేకంగా ఈ టీకా బలమైన రక్షణ అందిస్తోందని ఎఫ్​డీఏ పేర్కొంది. తీవ్రంగా జబ్బుపడటాన్ని, మరణాలను నివారిస్తుందని తెలిపింది. తీవ్రమైన కొవిడ్​కు వ్యతిరేకంగా 85 శాతం సమర్థతతో ఈ టీకా పనిచేస్తుందని వెల్లడించింది. మూడు ఖండాల్లో టీకాపై పరీక్షలు జరిగాయని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్ మంచి పనితీరు కనబర్చిందని ఎఫ్​డీఏ స్పష్టం చేసింది.

టీకా వినియోగానికి అనుమతులు లభించిన నేపథ్యంలో సోమవారం నుంచే డోసుల పంపిణీ ప్రారంభం కానుంది. మార్చి చివరి నాటికి 2 కోట్లు, వేసవి నాటికి 10 కోట్ల డోసులను సరఫరా చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

గత గురువారం బహ్రెయిన్ దేశం ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. ఐరోపా, ఐరాసల నుంచీ అత్యవసర అనుమతులు పొందాలని సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: బ్రిటన్​లో జాన్సెన్ టీకా మూడో దశ ట్రయల్స్​

అమెరికాలో మూడో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకే డోసుతో కరోనాను నివారించేలా జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ(ఎఫ్​డీఏ) నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.

85 శాతం సమర్థత!

వైరస్​కు వ్యతిరేకంగా ఈ టీకా బలమైన రక్షణ అందిస్తోందని ఎఫ్​డీఏ పేర్కొంది. తీవ్రంగా జబ్బుపడటాన్ని, మరణాలను నివారిస్తుందని తెలిపింది. తీవ్రమైన కొవిడ్​కు వ్యతిరేకంగా 85 శాతం సమర్థతతో ఈ టీకా పనిచేస్తుందని వెల్లడించింది. మూడు ఖండాల్లో టీకాపై పరీక్షలు జరిగాయని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్ మంచి పనితీరు కనబర్చిందని ఎఫ్​డీఏ స్పష్టం చేసింది.

టీకా వినియోగానికి అనుమతులు లభించిన నేపథ్యంలో సోమవారం నుంచే డోసుల పంపిణీ ప్రారంభం కానుంది. మార్చి చివరి నాటికి 2 కోట్లు, వేసవి నాటికి 10 కోట్ల డోసులను సరఫరా చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

గత గురువారం బహ్రెయిన్ దేశం ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. ఐరోపా, ఐరాసల నుంచీ అత్యవసర అనుమతులు పొందాలని సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: బ్రిటన్​లో జాన్సెన్ టీకా మూడో దశ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.