ETV Bharat / international

బైడెన్ కంటే కమల సంపాదనే ఎక్కువ

author img

By

Published : May 18, 2021, 10:28 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదాయం కన్నా.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దాదాపు 3రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. తాజాగా వారు వెల్లడించిన ఆదాయ పన్ను వివరాలు స్పష్టం చేశాయి.

Joe Biden and Kamala Harris release their tax returns
బైడెన్ కంటే కమల సంపాదనే ఎక్కువ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆదాయమే ఎక్కువ. 2020లో ఉపాధ్యక్షురాలి ఆదాయం రూ.12.41కోట్లుగా ఉంటే.. బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లే. ఈ మేరకు వారిద్దరూ తమ ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సోమవారం వెల్లడించారు.

అధ్యక్షుడు బైడెన్, అమెరికా తొలి మహిళ జిల్.. తమ ఆస్తుల వివరాలను సంయుక్తంగా ప్రకటించారు. 2019లో 9.85లక్షల డాలర్లు(రూ.7.21కోట్లు) ఉన్న వారి స్థూల ఆదాయం 2020లో 6.21లక్షల డాలర్లకు (సుమారు రూ.4.44కోట్లు) పడిపోయింది. అధ్యక్ష దంపతులు 2020 ఏడాదికి 1.57లక్షల డాలర్ల(రూ.1.15కోట్లు) పన్ను చెల్లించారు. అంటే అది వారి ఆదాయంలో 25.9శాతం.

ఇక ఉపాధ్యక్షరాలు కమలా, ఆమె భర్త డో ఎమ్ హాఫ్ ల స్థూల ఆదాయం.. 16.95లక్షల డాలర్లు(సుమారు రూ.12.41కోట్లు). వారు 6.21 లక్షల డాలర్ల(రూ.4.55కోట్లు) పన్ను చెల్లించారు. అంటే 36.7శాతం.

విరాళాలు..

2020లో బైడెన్ దంపతులు తమ ఆదాయంలో 5శాతం(రూ.22లక్షలు) విరాళమిచ్చారు. ఉపాధ్యక్షురాలు కమల దంపతులు.. సుమారు రూ.20లక్షలు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు.

ఇదీ చూడండి: 'ఇజ్రాయెల్-గాజా' కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆదాయమే ఎక్కువ. 2020లో ఉపాధ్యక్షురాలి ఆదాయం రూ.12.41కోట్లుగా ఉంటే.. బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లే. ఈ మేరకు వారిద్దరూ తమ ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సోమవారం వెల్లడించారు.

అధ్యక్షుడు బైడెన్, అమెరికా తొలి మహిళ జిల్.. తమ ఆస్తుల వివరాలను సంయుక్తంగా ప్రకటించారు. 2019లో 9.85లక్షల డాలర్లు(రూ.7.21కోట్లు) ఉన్న వారి స్థూల ఆదాయం 2020లో 6.21లక్షల డాలర్లకు (సుమారు రూ.4.44కోట్లు) పడిపోయింది. అధ్యక్ష దంపతులు 2020 ఏడాదికి 1.57లక్షల డాలర్ల(రూ.1.15కోట్లు) పన్ను చెల్లించారు. అంటే అది వారి ఆదాయంలో 25.9శాతం.

ఇక ఉపాధ్యక్షరాలు కమలా, ఆమె భర్త డో ఎమ్ హాఫ్ ల స్థూల ఆదాయం.. 16.95లక్షల డాలర్లు(సుమారు రూ.12.41కోట్లు). వారు 6.21 లక్షల డాలర్ల(రూ.4.55కోట్లు) పన్ను చెల్లించారు. అంటే 36.7శాతం.

విరాళాలు..

2020లో బైడెన్ దంపతులు తమ ఆదాయంలో 5శాతం(రూ.22లక్షలు) విరాళమిచ్చారు. ఉపాధ్యక్షురాలు కమల దంపతులు.. సుమారు రూ.20లక్షలు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు.

ఇదీ చూడండి: 'ఇజ్రాయెల్-గాజా' కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.