ETV Bharat / international

'భద్రతపై భారత్​, అమెరికా​ మధ్య త్వరలో కీలక చర్చలు' - బైడెన్​ ప్రభుత్వం

అమెరికా- భారత్​ మధ్య దేశ భద్రతకు సంబంధించిన సమావేశం తిరిగి ప్రారంభం అవుతుందని బైడెన్​ ప్రభుత్వం తెలిపింది. అమెరికా హోంమంత్రి అలెజాన్​డ్రో మాయోర్కాస్​.. భారత రాయబారి తరణ్​​ జిత్​ సింగ్ సంధుతో భేటీ అయిన అనంతరం ఈమేరకు ప్రకటించింది.

India, US agree to re-establish Homeland Security Dialogue
'అమెరికా-భారత్​ మధ్య త్వరలో దేశభద్రతా చర్చలు'
author img

By

Published : Mar 24, 2021, 10:57 AM IST

Updated : Mar 24, 2021, 1:29 PM IST

అమెరికా- భారత్​ మధ్య ఇరు దేశాల భద్రతకు సంబంధించిన చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని బైడెన్​ ప్రభుత్వం తెలిపింది. యూఎస్​ హోం మంత్రి అలెజాన్​డ్రో మాయోర్కాస్​.. భారత రాయబారి తరణ్​​జిత్​ సింగ్​ సంధుతో సోమవారం భేటీ అయిన అనంతరం ఈ విషయం వెల్లడించింది. ట్రంప్​ హయాంలో ఇరు దేశాల భద్రతకు సంబంధించిన సమావేశాలు నిలిచిపోయాయి.

సైబర్​ భద్రత, నూతన సాంకేతికత, ఉగ్రవాదం హెచ్చరిల్లడం వంటి కీలకాంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు అలెజాన్​ తెలిపారు.

ఇరువురి మధ్య జరిగిన భేటీలో ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశంలోని అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కరోనా కట్టడికి క్వాడ్ దేశాలు కలిసికట్టుగా పని చేయాలన్న తీర్మానం, వాతావరణ పరిస్థితులు, సైబర్​ భద్రత అంశాలు చర్చకు వచ్చాయి.

ఇదీ చదవండి: బైడెన్​ సర్కార్​కు 'వలస' తలనొప్పులు

అమెరికా- భారత్​ మధ్య ఇరు దేశాల భద్రతకు సంబంధించిన చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని బైడెన్​ ప్రభుత్వం తెలిపింది. యూఎస్​ హోం మంత్రి అలెజాన్​డ్రో మాయోర్కాస్​.. భారత రాయబారి తరణ్​​జిత్​ సింగ్​ సంధుతో సోమవారం భేటీ అయిన అనంతరం ఈ విషయం వెల్లడించింది. ట్రంప్​ హయాంలో ఇరు దేశాల భద్రతకు సంబంధించిన సమావేశాలు నిలిచిపోయాయి.

సైబర్​ భద్రత, నూతన సాంకేతికత, ఉగ్రవాదం హెచ్చరిల్లడం వంటి కీలకాంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు అలెజాన్​ తెలిపారు.

ఇరువురి మధ్య జరిగిన భేటీలో ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశంలోని అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కరోనా కట్టడికి క్వాడ్ దేశాలు కలిసికట్టుగా పని చేయాలన్న తీర్మానం, వాతావరణ పరిస్థితులు, సైబర్​ భద్రత అంశాలు చర్చకు వచ్చాయి.

ఇదీ చదవండి: బైడెన్​ సర్కార్​కు 'వలస' తలనొప్పులు

Last Updated : Mar 24, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.