ETV Bharat / international

సిరియాకు సాయాన్ని రాజకీయం చేయొద్దు: భారత్​

author img

By

Published : Feb 26, 2021, 11:57 AM IST

సిరియాకు సహాయం చేసే విషయాన్ని రాజకీయ దృక్పథంలో చూడొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలకు భారత్​ సూచించింది. ప్రస్తుతం.. ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఈ సమయంలోసహాయ సహకారాలు అందించడం అవశ్యకమని పేర్కొంది.

India calls on UNSC members to end politicisation of humanitarian aid to Syrian citizens
సిరియా అంశాన్ని రాజకీయం చేయొద్దు: భారత్​

సిరియాకు మానవతా దృక్పథంతో సహాయం చేసే అంశాన్ని రాజకీయం చేయొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్సీ) సభ్యదేశాలకు భారత్​ సూచించింది. రాజకీయ కోణంలో చూడటం వల్ల.. ఆ దేశం అత్యవసర సాయాన్ని కోల్పోతోందని ఐరాసలో భారత రాయబారి టీఎస్​ తిరుమూర్తి అన్నారు.

"సిరియా స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం అక్కడివారికి సాయం చేయడం ఆవశ్యకం. ఈ పరిస్థితుల్లో అందరూ ఆ దేశాన్ని ఆదుకోవాల్సిన అవసరముంది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల.. అక్కడి పౌరులు అత్యవసర సాయాన్ని కోల్పోతున్నారు."

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత రాయబారి

ఆపదలో ఉన్న సిరియా ప్రజలను వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ఈ నెలారంభంలో ఆ దేశానికి భారత్​.. 2 వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అయితే.. గతేడాది జులైలో కొవిడ్​ సంక్షోభం నెలకొన్న సమయంలోనూ 10 మెట్రిక్​ టన్నుల ఔషధాలను సిరియాకు పంపి మానవతా వాదాన్ని చాటుకుంది భారత్​.

2011లో అరబ్​ కాలంలో ఆ దేశ అధ్యక్షుడు బషర్​ అల్​-అస్సాద్​కు వ్యతిరేకంగా శాంతియుత తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ ఘర్షణతో నాటి నుంచీ అక్కడి ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఆ దేశ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇదీ చదవండి: 'ఖేలో ఇండియా​'కు ముందు స్కైయర్ల విన్యాసాలు

సిరియాకు మానవతా దృక్పథంతో సహాయం చేసే అంశాన్ని రాజకీయం చేయొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్సీ) సభ్యదేశాలకు భారత్​ సూచించింది. రాజకీయ కోణంలో చూడటం వల్ల.. ఆ దేశం అత్యవసర సాయాన్ని కోల్పోతోందని ఐరాసలో భారత రాయబారి టీఎస్​ తిరుమూర్తి అన్నారు.

"సిరియా స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం అక్కడివారికి సాయం చేయడం ఆవశ్యకం. ఈ పరిస్థితుల్లో అందరూ ఆ దేశాన్ని ఆదుకోవాల్సిన అవసరముంది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల.. అక్కడి పౌరులు అత్యవసర సాయాన్ని కోల్పోతున్నారు."

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత రాయబారి

ఆపదలో ఉన్న సిరియా ప్రజలను వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ఈ నెలారంభంలో ఆ దేశానికి భారత్​.. 2 వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అయితే.. గతేడాది జులైలో కొవిడ్​ సంక్షోభం నెలకొన్న సమయంలోనూ 10 మెట్రిక్​ టన్నుల ఔషధాలను సిరియాకు పంపి మానవతా వాదాన్ని చాటుకుంది భారత్​.

2011లో అరబ్​ కాలంలో ఆ దేశ అధ్యక్షుడు బషర్​ అల్​-అస్సాద్​కు వ్యతిరేకంగా శాంతియుత తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ ఘర్షణతో నాటి నుంచీ అక్కడి ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఆ దేశ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇదీ చదవండి: 'ఖేలో ఇండియా​'కు ముందు స్కైయర్ల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.