ETV Bharat / international

కరోనాపై 6 దేశాల మంత్రులతో పాంపియో చర్చ

author img

By

Published : May 12, 2020, 3:35 PM IST

కరోనాపై పోరులో పరస్పర సహకారంపై చర్చించేందుకు ఆరు దేశాలు విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. చర్చలు ఫలవంతంగా ముగిసినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​ జైశంకర్ తెలిపారు.

Pompeo holds video conference with counterparts from India, 5 other nations
ఆరు దేశాలు విదేశాంగ మంత్రులతో మైక్​ పాంపియో సమావేశం

కరోనా మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం ఆవశ్యకత అంశంపై భారత్​ సహా మొత్తం 6 దేశాల విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమెరిగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. కొవిడ్​ను జయించేందుకు పరస్పర సహకారం, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆరు దేశాల ప్రతినిధులతో చర్చించినట్లు అగ్రరాజ్యం అధికార ప్రతినిధి తెలిపారు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​. జైశంకర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇజ్రాయెల్, జపాన్​, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులు మరైస్ పేనీ, ఎర్నెస్టో హెర్నిక్​, యిస్రాయెల్ కట్జ్​, టారో కోనో, కంగ్​ క్యుంగ్​ వాలతో పాంపియో మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు..

సమావేశం ఫలవంతం

కరోనా సవాళ్లను ఎదుర్కోనే అంశంపై జరిగిన సమావేశం సుదీర్ఘంగా జరిగినట్లు చెప్పారు జైశంకర్​. చర్చ ఫలవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు. వైద్య రంగంలో సహకారం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రయాణ ఆంక్షలపైనా చర్చించినట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 2,86,000 మంది కరోనా వైరస్​కు బలయ్యారు. 41లక్షల 78వేల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. అమెరికా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఆ దేశంలో 80వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13లక్షల 50వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం ఆవశ్యకత అంశంపై భారత్​ సహా మొత్తం 6 దేశాల విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమెరిగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. కొవిడ్​ను జయించేందుకు పరస్పర సహకారం, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆరు దేశాల ప్రతినిధులతో చర్చించినట్లు అగ్రరాజ్యం అధికార ప్రతినిధి తెలిపారు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​. జైశంకర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇజ్రాయెల్, జపాన్​, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులు మరైస్ పేనీ, ఎర్నెస్టో హెర్నిక్​, యిస్రాయెల్ కట్జ్​, టారో కోనో, కంగ్​ క్యుంగ్​ వాలతో పాంపియో మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు..

సమావేశం ఫలవంతం

కరోనా సవాళ్లను ఎదుర్కోనే అంశంపై జరిగిన సమావేశం సుదీర్ఘంగా జరిగినట్లు చెప్పారు జైశంకర్​. చర్చ ఫలవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు. వైద్య రంగంలో సహకారం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రయాణ ఆంక్షలపైనా చర్చించినట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 2,86,000 మంది కరోనా వైరస్​కు బలయ్యారు. 41లక్షల 78వేల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. అమెరికా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఆ దేశంలో 80వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13లక్షల 50వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.