ETV Bharat / international

గుట్టు వీడింది... కరోనా వైరస్​ పుట్టింది అలానే...

author img

By

Published : Mar 18, 2020, 5:10 PM IST

కరోనా​.. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్నే తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న మహమ్మారి. ఈ వైరస్ ఎలా వచ్చిందనే విషయమై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను ఎవరైనా సృష్టించారా? సహజంగానే వచ్చిందా అనే విషయమై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో కొవిడ్​-19ను ఎవరూ సృష్టించలేదని, అది సహజ సిద్ధంగానే వచ్చిందని చెబుతోంది తాజా సర్వే. ఫలితంగా.. వైరస్​ను పరిశోధన కేంద్రంలో సృష్టించారనే ఊహాగానాలకు చెక్​ పడింది. ఈ అధ్యయనంలోని మరిన్ని విషయాలు...

గుట్టు వీడింది... కరోనా వైరస్​ పుట్టింది అలానే...
COVID-19: Not man made

"వుహాన్​లోని ఓ మార్కెట్​లో కరోనా వైరస్​ పుట్టింది.. వైరస్​ను చైనాకు అమెరికా సైనికులే తెచ్చారు. మహమ్మారిని ఓ పరిశోధన కేంద్రంలో చైనానే కృత్రిమంగా సృష్టించింది..." ఇవీ.. ఈ ప్రాణాంతక వైరస్​పై ఉన్న ఊహాగానాలు.

చైనా కేంద్రబిందువుగా డిసెంబర్​లో వెలుగు చూసిన వైరస్​ పుట్టుకకు అసలైన కారణం ఇంకా తెలియకపోవడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్​ పెడుతూ.. ప్రాణాంతక వైరస్​ను కృత్రిమంగా సృష్టించలేమని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. ఇది ప్రకృతి సంబంధిత మార్పు వల్లే ఏర్పడిందని స్పష్టం చేసింది.

నేచర్​ మెడిసిన్​ అనే జర్నల్​లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. అందుబాటులో ఉన్న జినోమ్​ సీక్వెన్స్​(జన్యు క్రమం) డేటా ఆధారంగా.. సార్స్​-సీఓవీ-2, సంబంధిత వైరస్​లపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు.

ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన స్క్రిప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. వైరస్​ను​ ల్యాబ్​లో కృత్రిమంగా సృష్టించగలం అన్న దానికి ఆధారాలు లభించలేదన్నారు.

"అందుబాటులో ఉన్న జినోమ్​ సీక్వెన్స్ డేటాతో వైరస్​ జాతులను​ పోల్చితే.. కచ్చితంగా ఇది సహజ ప్రక్రియ కారణంగానే ఏర్పడిందని మేం చెప్పగలం."

-- క్రిస్టియన్​ ఆండర్సన్​, స్క్రిప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ జర్నల్​ సహ రచయిత

వైరస్​ను చైనా అధికారులు వేగంగా గుర్తించారని, ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేసులు నమోదవుతున్నాయన్నారు.

స్పైక్​ ప్రోటీన్స్​కు సంబంధించిన జెనెటిక్​ టెంప్లేట్స్​పై పరిశోధన చేపట్టారు. వైరస్​ వెలుపలి భాగంలో ఉండే ఈ జన్యు టెంప్లేట్లు.. మనిషి, జంతు కణాలను పట్టుకుని, లోపలకు చొచ్చుకుపోయే విధంగా ఉపయోగపడతాయి.

ఈ స్పైక్​ ప్రోటీన్​లోని రెండు ముఖ్య లక్షణాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. అందులో ఒకటి రిసెప్టర్​-బైండింగ్​- డొమైన్​(ఆర్​బీడీ). ఆతిథ్య కణాలను గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. రెండోది క్లీవేజ్​ సైట్​. వైరస్​కు ఇది.. ఆతిథ్య కణాలను చీల్చి లోపలకు ప్రవేశించే శక్తినిస్తుంది.

గబ్బిలం నుంచే...!

పరిశోధనను దృష్టిలో పెట్టుకుని.. వైరస్​ మూలాలు ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వైరస్​ మానవేతర జీవుల్లోకి తొలుత చొచ్చుకెళ్లి.. ఆ తర్వాత మనిషి కణాల్లోకి చేరి ఉండవచ్చు.

వైరస్​ గబ్బిలాల్లో అధికంగా ఉండే అవకాశముంది. అయితే కరోనా వైరస్​ గబ్బిలాల నుంచి మనిషికి సోకి ఉంటుందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఫలితంగా రెండింటి మధ్య అనుసంధానంగా ఏదైనా పరాన్న జీవి ద్వారా గబ్బిలాల నుంచి మనిషికి చేరే అవకాశముంది.

జంతువుల నుంచి ఆపై పరాన్న జీవి ద్వారా..

ఈ అంటువ్యాధి మనుషులకు సోకిన వెంటనే.. అంతే వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్​ ఇప్పటికే వ్యాధికారక లక్షణాలను అభివృద్ధి చేసి, ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపచేస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాధికారకం కాని వైరస్​.. జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని, ఆ తర్వాతే అది ప్రస్తుత తీవ్ర పరిణామానికి(వ్యాధికారకంగా) దారి తీస్తున్నట్లుగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

క్షీరదాల్లో అవే లక్షణాలు...

ఆసియా, ఆఫ్రికాల్లో పాంగోలిన్​, అర్మాడిల్లో వంటి క్షీరదాలను ఉదహరిస్తూ.. వీటి నుంచి కరోనా వైరస్​ వ్యాపించే అవకాశముందని స్పష్టం చేశారు. సార్స్​-కరోనా వైరస్​​-2 లక్షణాలను పోలిన ఆర్​బీడీ నమూనా ఈ క్షీరదాలకు ఉన్నట్లు గుర్తించారు.

పాంగోలిన్​ నుంచి మనుషులకు సంక్రమించే కరోనా వైరస్​.. ప్రత్యక్షంగా లేదా ఏదైనా పరాన్న జీవి ద్వారా సోకుతున్నట్లు స్పష్టం చేశారు.

స్పైక్​ ప్రొటీన్​కున్న విలక్షణమైన స్వభావం ప్రకారం.. ఈ వైరస్​ మనుషుల్లోనే ఉద్భవిస్తున్నట్లు, అంటువ్యాధి పెద్దగా ప్రబలకముందే దాదాపు పరిమితంగా విస్తరించినట్లు అధ్యయనం తెలిపింది.

సార్స్-కరోనా-2​ క్లీవేజ్​ సైట్​... మనుషుల మధ్య అత్యంత సులభంగా వ్యాపించే బర్డ్​ ఫ్లూ లక్షణాలను కలిగిఉన్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అదే సందర్భంలో.. కరోనా వైరస్​-2 కూడా మరింత ప్రభావవంతంగా మనుషుల్లో సంక్రమించనున్నట్లు వివరించారు. ఇది మరింత క్లిష్టంగా మారే అవకాశముందనీ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:

అమెరికా X చైనా: 'కరోనా పాపం మీదే... కాదు మీదే'

"వుహాన్​లోని ఓ మార్కెట్​లో కరోనా వైరస్​ పుట్టింది.. వైరస్​ను చైనాకు అమెరికా సైనికులే తెచ్చారు. మహమ్మారిని ఓ పరిశోధన కేంద్రంలో చైనానే కృత్రిమంగా సృష్టించింది..." ఇవీ.. ఈ ప్రాణాంతక వైరస్​పై ఉన్న ఊహాగానాలు.

చైనా కేంద్రబిందువుగా డిసెంబర్​లో వెలుగు చూసిన వైరస్​ పుట్టుకకు అసలైన కారణం ఇంకా తెలియకపోవడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్​ పెడుతూ.. ప్రాణాంతక వైరస్​ను కృత్రిమంగా సృష్టించలేమని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. ఇది ప్రకృతి సంబంధిత మార్పు వల్లే ఏర్పడిందని స్పష్టం చేసింది.

నేచర్​ మెడిసిన్​ అనే జర్నల్​లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. అందుబాటులో ఉన్న జినోమ్​ సీక్వెన్స్​(జన్యు క్రమం) డేటా ఆధారంగా.. సార్స్​-సీఓవీ-2, సంబంధిత వైరస్​లపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు.

ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన స్క్రిప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. వైరస్​ను​ ల్యాబ్​లో కృత్రిమంగా సృష్టించగలం అన్న దానికి ఆధారాలు లభించలేదన్నారు.

"అందుబాటులో ఉన్న జినోమ్​ సీక్వెన్స్ డేటాతో వైరస్​ జాతులను​ పోల్చితే.. కచ్చితంగా ఇది సహజ ప్రక్రియ కారణంగానే ఏర్పడిందని మేం చెప్పగలం."

-- క్రిస్టియన్​ ఆండర్సన్​, స్క్రిప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ జర్నల్​ సహ రచయిత

వైరస్​ను చైనా అధికారులు వేగంగా గుర్తించారని, ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేసులు నమోదవుతున్నాయన్నారు.

స్పైక్​ ప్రోటీన్స్​కు సంబంధించిన జెనెటిక్​ టెంప్లేట్స్​పై పరిశోధన చేపట్టారు. వైరస్​ వెలుపలి భాగంలో ఉండే ఈ జన్యు టెంప్లేట్లు.. మనిషి, జంతు కణాలను పట్టుకుని, లోపలకు చొచ్చుకుపోయే విధంగా ఉపయోగపడతాయి.

ఈ స్పైక్​ ప్రోటీన్​లోని రెండు ముఖ్య లక్షణాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. అందులో ఒకటి రిసెప్టర్​-బైండింగ్​- డొమైన్​(ఆర్​బీడీ). ఆతిథ్య కణాలను గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. రెండోది క్లీవేజ్​ సైట్​. వైరస్​కు ఇది.. ఆతిథ్య కణాలను చీల్చి లోపలకు ప్రవేశించే శక్తినిస్తుంది.

గబ్బిలం నుంచే...!

పరిశోధనను దృష్టిలో పెట్టుకుని.. వైరస్​ మూలాలు ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వైరస్​ మానవేతర జీవుల్లోకి తొలుత చొచ్చుకెళ్లి.. ఆ తర్వాత మనిషి కణాల్లోకి చేరి ఉండవచ్చు.

వైరస్​ గబ్బిలాల్లో అధికంగా ఉండే అవకాశముంది. అయితే కరోనా వైరస్​ గబ్బిలాల నుంచి మనిషికి సోకి ఉంటుందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఫలితంగా రెండింటి మధ్య అనుసంధానంగా ఏదైనా పరాన్న జీవి ద్వారా గబ్బిలాల నుంచి మనిషికి చేరే అవకాశముంది.

జంతువుల నుంచి ఆపై పరాన్న జీవి ద్వారా..

ఈ అంటువ్యాధి మనుషులకు సోకిన వెంటనే.. అంతే వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్​ ఇప్పటికే వ్యాధికారక లక్షణాలను అభివృద్ధి చేసి, ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపచేస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాధికారకం కాని వైరస్​.. జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని, ఆ తర్వాతే అది ప్రస్తుత తీవ్ర పరిణామానికి(వ్యాధికారకంగా) దారి తీస్తున్నట్లుగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

క్షీరదాల్లో అవే లక్షణాలు...

ఆసియా, ఆఫ్రికాల్లో పాంగోలిన్​, అర్మాడిల్లో వంటి క్షీరదాలను ఉదహరిస్తూ.. వీటి నుంచి కరోనా వైరస్​ వ్యాపించే అవకాశముందని స్పష్టం చేశారు. సార్స్​-కరోనా వైరస్​​-2 లక్షణాలను పోలిన ఆర్​బీడీ నమూనా ఈ క్షీరదాలకు ఉన్నట్లు గుర్తించారు.

పాంగోలిన్​ నుంచి మనుషులకు సంక్రమించే కరోనా వైరస్​.. ప్రత్యక్షంగా లేదా ఏదైనా పరాన్న జీవి ద్వారా సోకుతున్నట్లు స్పష్టం చేశారు.

స్పైక్​ ప్రొటీన్​కున్న విలక్షణమైన స్వభావం ప్రకారం.. ఈ వైరస్​ మనుషుల్లోనే ఉద్భవిస్తున్నట్లు, అంటువ్యాధి పెద్దగా ప్రబలకముందే దాదాపు పరిమితంగా విస్తరించినట్లు అధ్యయనం తెలిపింది.

సార్స్-కరోనా-2​ క్లీవేజ్​ సైట్​... మనుషుల మధ్య అత్యంత సులభంగా వ్యాపించే బర్డ్​ ఫ్లూ లక్షణాలను కలిగిఉన్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అదే సందర్భంలో.. కరోనా వైరస్​-2 కూడా మరింత ప్రభావవంతంగా మనుషుల్లో సంక్రమించనున్నట్లు వివరించారు. ఇది మరింత క్లిష్టంగా మారే అవకాశముందనీ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:

అమెరికా X చైనా: 'కరోనా పాపం మీదే... కాదు మీదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.