ETV Bharat / international

కరోనా రోగులు 'రుచి' కోల్పోయేది అందుకే...

author img

By

Published : Aug 11, 2020, 1:05 PM IST

కరోనా సోకిన చాలా మందిలో రుచి, వాసన గుర్తించే శక్తి కోల్పోవటం చూస్తున్నాం. అయితే వైరస్ ప్రత్యక్షంగా రుచి గుర్తించే కణాలపై దాడి చేయటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుందా? లేదా వైరస్​ వల్ల ఏర్పడిన మృత కణాలే ఇందుకు కారణమా? జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

COVID-19
కరోనా రోగులు

కరోనాతో బాధపడుతున్నవారికి జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులతో పాటు ఇతర అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది రుచి, వాసన చూసే శక్తి కోల్పోవటం. వైరస్ సోకినవారిలో 20 నుంచి 25 శాతం మంది రుచిని గుర్తించే సామర్థ్యం కోల్పోతున్నారని తాజా అధ్యయనం తెలిపింది.

అయితే కరోనా వైరస్ రుచిని గుర్తించే కణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఏసీఎస్​ ఫార్మాకాలజీ అండ్ ట్రాన్స్​లేషనల్ సైన్స్​ అనే జర్నల్​లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. గతంలో జరిగిన పరిశోధనలకు పూర్తి భిన్నమైన ఫలితాలను ఇచ్చింది.

"వైరస్ సోకిన కొన్ని రోజులకు వ్యాధిగ్రస్తుల్లో కొంతమంది రుచి చూసే శక్తి కోల్పోతున్నారు. క్రమంగా వీరి రేటు పెరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సార్స్​-కోవ్​-2 వైరస్ రుచి మొగ్గలపై ప్రభావం చూపదు. కానీ, వైరస్ వల్ల మరణించిన మృతకణాల కారణంగా రుచిని గుర్తించే శక్తిని కోల్పోతూ ఉండొచ్చు."

- హాంగ్​జియాంగ్ లియూ, జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకురాలు

కరోనా వైరస్ మన కణాల్లో ప్రవేశించేందుకు ఏసీఈ-2 ప్రొటీన్లను ఉపయోగిస్తుంది. అయితే రుచి మొగ్గలు కరోనా సంక్రమణకు గురికావని అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే ఈ కణాలు చాలావరకు ఏసీఈ-2కు స్పందించలేవని స్పష్టం చేస్తోంది.

ఎలుకలపై ప్రయోగాలతో..

ఇందుకు సంబంధించి లియూ బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది. వీటిలోని ఏసీఈ-2 వెర్షన్​ కరోనా వైరస్​కు ప్రభావానికి గురికాలేదని గుర్తించారు. నాలుకపై ఉన్న కణాల్లో ఏసీఈ-2 అధికంగా ఉన్నా రుచిమొగ్గల్లో మాత్రం వీటి జాడ లేదని నిర్ధరించారు.

ఎలుకలు, మానవుల జన్యు నమూనాలు ఒకేలా ఉండటం వల్ల మనుషుల్లోనూ వైరస్ ప్రభావంపై ఈ మేరకు అంచనా వేయొచ్చని అంటున్నారు. ఈ ప్రయోగాల ద్వారా కరోనా ప్రత్యక్ష ప్రభావంతో రుచిని కోల్పోయే అవకాశం లేదని స్పష్టంగా చెబుతోంది లియూ బృందం.

ఇదీ చూడండి: రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజేషన్​!

కరోనాతో బాధపడుతున్నవారికి జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులతో పాటు ఇతర అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది రుచి, వాసన చూసే శక్తి కోల్పోవటం. వైరస్ సోకినవారిలో 20 నుంచి 25 శాతం మంది రుచిని గుర్తించే సామర్థ్యం కోల్పోతున్నారని తాజా అధ్యయనం తెలిపింది.

అయితే కరోనా వైరస్ రుచిని గుర్తించే కణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఏసీఎస్​ ఫార్మాకాలజీ అండ్ ట్రాన్స్​లేషనల్ సైన్స్​ అనే జర్నల్​లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. గతంలో జరిగిన పరిశోధనలకు పూర్తి భిన్నమైన ఫలితాలను ఇచ్చింది.

"వైరస్ సోకిన కొన్ని రోజులకు వ్యాధిగ్రస్తుల్లో కొంతమంది రుచి చూసే శక్తి కోల్పోతున్నారు. క్రమంగా వీరి రేటు పెరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సార్స్​-కోవ్​-2 వైరస్ రుచి మొగ్గలపై ప్రభావం చూపదు. కానీ, వైరస్ వల్ల మరణించిన మృతకణాల కారణంగా రుచిని గుర్తించే శక్తిని కోల్పోతూ ఉండొచ్చు."

- హాంగ్​జియాంగ్ లియూ, జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకురాలు

కరోనా వైరస్ మన కణాల్లో ప్రవేశించేందుకు ఏసీఈ-2 ప్రొటీన్లను ఉపయోగిస్తుంది. అయితే రుచి మొగ్గలు కరోనా సంక్రమణకు గురికావని అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే ఈ కణాలు చాలావరకు ఏసీఈ-2కు స్పందించలేవని స్పష్టం చేస్తోంది.

ఎలుకలపై ప్రయోగాలతో..

ఇందుకు సంబంధించి లియూ బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది. వీటిలోని ఏసీఈ-2 వెర్షన్​ కరోనా వైరస్​కు ప్రభావానికి గురికాలేదని గుర్తించారు. నాలుకపై ఉన్న కణాల్లో ఏసీఈ-2 అధికంగా ఉన్నా రుచిమొగ్గల్లో మాత్రం వీటి జాడ లేదని నిర్ధరించారు.

ఎలుకలు, మానవుల జన్యు నమూనాలు ఒకేలా ఉండటం వల్ల మనుషుల్లోనూ వైరస్ ప్రభావంపై ఈ మేరకు అంచనా వేయొచ్చని అంటున్నారు. ఈ ప్రయోగాల ద్వారా కరోనా ప్రత్యక్ష ప్రభావంతో రుచిని కోల్పోయే అవకాశం లేదని స్పష్టంగా చెబుతోంది లియూ బృందం.

ఇదీ చూడండి: రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.