ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఇప్పటివరకు 27, 365మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5,97, 267మంది ఈ వైరస్ బారినపడ్డారు. 1,33,363 మందికి వ్యాధి నయమైంది. 1, 04, 205 కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్యలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. 9,134 మరణాలతో ఇటలీ మరణాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
![corona world tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6569919_corona-global.jpg)
చైనాలో పెరుగుతున్న కేసులు..
చైనాలో కరోనా వైరస్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విదేశాల నుంచి చైనాకు వెళ్లిన 54 మందికి కొత్తగా కొవిడ్- 19 సోకిందని నిర్ధరణ అయింది. మరో 29 మందికి వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.
చైనాలో ప్రస్తుతం 3,128 మంది కరోనాతో బాధపడుతున్నారు. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,295. మొత్తం బాధితుల సంఖ్య 81, 394.
హాంకాంగ్లో వైరస్ కారణంగా కొత్తగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 518 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: కరోనాపై పోరు: భారత్కు అమెరికా ఆర్థిక సాయం