1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే 2021 పౌరసత్వ బిల్లును అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. వివిధ దేశాలకు ఇచ్చే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోటాను తొలగించడం, హెచ్-1బీ విదేశీ కార్మికులపై ఆధారపడినవారికి పని అధికారం వంటి విషయాలను ఈ బిల్లులో పొందుపరిచారు.
ఈ బిల్లుకు ప్రతినిధుల సభ, సెనేట్లో ఆమోదం లభిస్తే అక్రమ వలసదారులతో పాటు లక్షలాది మంది విదేశీ పౌరులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలకు ఈ బిల్లు లబ్ధి చేకూర్చనుంది.
ఈ బిల్లును సెనేటర్లు బాబ్ మెనెండెజ్, లిండా సాంచెజ్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు.
బిల్లులో ఏమున్నాయి?
- ఉపాధి-ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయడం.
- ప్రతి దేశానికి ఇచ్చే వీసాల్లో పరిమితులను తొలగించడం.
- తక్కువ వేతన పరిశ్రమలలోని కార్మికులకు గ్రీన్కార్డుల లభ్యతను మెరుగుపరచడం.
- హెచ్-1బీ వీసాదారులకు పని అధికారం.
"నేను మెక్సికో నుంచి వలస వచ్చిన వారి కూతురిని. ప్రజలు భయం లేకుండా జీవించడానికి వీలు కల్పించే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రూపొందిచాలని, దేశ అభివృద్ధికి నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రతిపాదించాం."
- లిండా సాంచెజ్, కాంగ్రెస్ సభ్యురాలు.
అధికార డెమొక్రాట్లకు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ మెజారిటీ ఉంది. అయినప్పటికీ ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సెనేట్లో వారికి 10మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం.
దేశంలో నివసిస్తోన్న మిలియన్ల మంది వలసదారుల ప్రయోజనాల కోసం తమకు అవసరమైన మద్దతు లభిస్తుందని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు.
- ఇదీ చూడండి: 'కశ్మీర్లో ఆ దేశాల వారిని అనుమతించాలి'