ETV Bharat / international

'కరోనా అంటే ఏంటి? మాకు నిజంగా తెలియదే..!' - These people did not even heard about covid-19, Corona virus till now? resons here

కరోనా వైరస్​.. ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం. కొన్ని రోజులుగా కోట్ల మందిని హడలెత్తిస్తోంది. ఎన్నో దేశాలు దీని నియంత్రణను ఓ సవాల్​గా తీసుకున్నాయి. అయితే ఈ వైరస్​ గురించి తెలియని వాళ్లు చాలా మంది ఉన్నారంటే నమ్మగలరా? అయితే ఇది చదవండి.

These people did not even heard about covid-19, Corona
కరోనా వైరస్​ అంటే వీళ్లకి అస్సలు తెలియదట.?
author img

By

Published : Jun 26, 2020, 2:24 PM IST

కరోనా.. కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. చైనాలో గతేడాది డిసెంబర్​లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్​.. అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాల్లో అడుగుపెట్టింది. అందుకే టీవీలు, రేడియోలు, సామాజిక మాధ్యమాలు.. ఇలా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వ్యాక్సిన్​ లేని ఈ వైరస్ కోసం.. మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాయి. అయితే ఈ మహమ్మారి గురించి తెలియని కొందరు సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు కదా.

సగానికి పైగా...

ఆఫ్రికా ఖండంలోని సోమాలియాలో అడుగుపెడుతున్న కొందరు వలస కూలీలకు.. కరోనా గురించి తెలియనే తెలియదట. ఇంటర్నేషనల్​ ఆర్గనైజేషన్​ ఫర్​ మైగ్రేషన్​ (ఐఓఎం) చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇథియోపియా నుంచి కూలీలు సోమాలియా వెళ్తుంటారు. మరికొంతమంది నిత్యం దాడులు జరిగే యెమెన్​ గుండా సౌదీ అరేబియాకు నడక మార్గంలో వెళ్తుంటారు. ఇందుకోసం ఎర్రసముద్రాన్ని ఆశ్రయిస్తారు. అయితే సోమాలియా సరిహద్దు వద్ద వలస కూలీలను కలిసి ఐఓఎం బృందం.. పలు ప్రశ్నలు సంధించింది. ఇందులో 51 శాతం మంది వలస కార్మికులకు కరోనా గురించి తెలియదట. అసలు ఆ పేరు వినలేదని చెప్పారట. అలాంటి 3471 మందిని గుర్తించినట్లు ఆ సంస్థ తెలిపింది.

సర్వేలో ప్రశ్నలు ఇలా..!

సర్వేలో వలసదారులకు సులభమైన ప్రశ్నలనే వేస్తుంటారు. ఎక్కడనుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? మీ గుంపులో ఎంత మందికి కరోనా వైరస్ గురించి తెలుసు? సోమాలియాలో కరోనా ఉందని తెలుసా? అని అడుగుతారు. అలా జూన్ 20న ముగిసిన సర్వే ఫలితాల్లో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో దాదాపు సగం మంది అసలు కరోనా గురించి వినలేదని చెప్పడం కలవరానికి గురిచేస్తోంది.

" తొలిసారి వారి నుంచి వచ్చిన స్పందన చూసి షాకయ్యా. ఇథియోపియాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వలస కూలీలు సోమాలియా వెళ్తుంటారు. వారికి సరైన చదువు ఉండదు. ఇంటర్నెట్​ సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. తొలుత 88 శాతం మందికి వైరస్​ గురించి తెలియదని చెప్పారు. చాలా మందికి యెమెన్​లో వాళ్లు వెళ్లే ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుందని తెలియదని చెప్పేవారు. అప్పట్నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం"

-సెలెస్టే సన్​చెజ్​ బీన్​, ప్రోగ్రామ్​ మేనేజర్​

దోమ కాటు నుంచి కరోనా...!

వలస కూలీలకు.. వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుంది? వాటి లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు బీన్​. చాలా మంది పాజిటివ్​ కేసులు వస్తున్న ప్రాంతాల్లోనూ ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరు వైరస్​ వాహకులుగా ఉన్నారని ఇప్పటికే సోమాలియాలోని బొసాకో వంటి ప్రాంతాల్లో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆమె తెలిపారు.

" స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్ల చాలా మంది వలస కూలీలు దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని బీన్​ చెప్పారు. ఆల్​ఖైదా చైతుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు లేవని... ఇంటర్నెట్​ సదుపాయం కూడా తక్కువేనని స్పష్టం చేశారు. ఫలితంగానే వారు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారన్నారు.

ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండే ఆఫ్రికా సోమాలియాలో ఇప్పటికే 2800 పైగా కేసులు నమోదయ్యాయి. చాలా మందికి కరోనా అనేది దోమకాటువల్ల వస్తుందని, ఇది డయేరియా లాంటిదని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే కొన్ని అవగాహన కార్యక్రమాల వల్ల ఆఫ్రికాలోని చాలా దేశాలకు ఇప్పుడిప్పుడే కరోనా గురించిన సమాచారం చేరుతోందని బీన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: నీటి అడుగున ఉండే వీరికి కరోనా గురించి తెలియదట!

కరోనా.. కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. చైనాలో గతేడాది డిసెంబర్​లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్​.. అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాల్లో అడుగుపెట్టింది. అందుకే టీవీలు, రేడియోలు, సామాజిక మాధ్యమాలు.. ఇలా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వ్యాక్సిన్​ లేని ఈ వైరస్ కోసం.. మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాయి. అయితే ఈ మహమ్మారి గురించి తెలియని కొందరు సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు కదా.

సగానికి పైగా...

ఆఫ్రికా ఖండంలోని సోమాలియాలో అడుగుపెడుతున్న కొందరు వలస కూలీలకు.. కరోనా గురించి తెలియనే తెలియదట. ఇంటర్నేషనల్​ ఆర్గనైజేషన్​ ఫర్​ మైగ్రేషన్​ (ఐఓఎం) చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇథియోపియా నుంచి కూలీలు సోమాలియా వెళ్తుంటారు. మరికొంతమంది నిత్యం దాడులు జరిగే యెమెన్​ గుండా సౌదీ అరేబియాకు నడక మార్గంలో వెళ్తుంటారు. ఇందుకోసం ఎర్రసముద్రాన్ని ఆశ్రయిస్తారు. అయితే సోమాలియా సరిహద్దు వద్ద వలస కూలీలను కలిసి ఐఓఎం బృందం.. పలు ప్రశ్నలు సంధించింది. ఇందులో 51 శాతం మంది వలస కార్మికులకు కరోనా గురించి తెలియదట. అసలు ఆ పేరు వినలేదని చెప్పారట. అలాంటి 3471 మందిని గుర్తించినట్లు ఆ సంస్థ తెలిపింది.

సర్వేలో ప్రశ్నలు ఇలా..!

సర్వేలో వలసదారులకు సులభమైన ప్రశ్నలనే వేస్తుంటారు. ఎక్కడనుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? మీ గుంపులో ఎంత మందికి కరోనా వైరస్ గురించి తెలుసు? సోమాలియాలో కరోనా ఉందని తెలుసా? అని అడుగుతారు. అలా జూన్ 20న ముగిసిన సర్వే ఫలితాల్లో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో దాదాపు సగం మంది అసలు కరోనా గురించి వినలేదని చెప్పడం కలవరానికి గురిచేస్తోంది.

" తొలిసారి వారి నుంచి వచ్చిన స్పందన చూసి షాకయ్యా. ఇథియోపియాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వలస కూలీలు సోమాలియా వెళ్తుంటారు. వారికి సరైన చదువు ఉండదు. ఇంటర్నెట్​ సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. తొలుత 88 శాతం మందికి వైరస్​ గురించి తెలియదని చెప్పారు. చాలా మందికి యెమెన్​లో వాళ్లు వెళ్లే ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుందని తెలియదని చెప్పేవారు. అప్పట్నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం"

-సెలెస్టే సన్​చెజ్​ బీన్​, ప్రోగ్రామ్​ మేనేజర్​

దోమ కాటు నుంచి కరోనా...!

వలస కూలీలకు.. వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుంది? వాటి లక్షణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు బీన్​. చాలా మంది పాజిటివ్​ కేసులు వస్తున్న ప్రాంతాల్లోనూ ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరు వైరస్​ వాహకులుగా ఉన్నారని ఇప్పటికే సోమాలియాలోని బొసాకో వంటి ప్రాంతాల్లో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆమె తెలిపారు.

" స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్ల చాలా మంది వలస కూలీలు దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని బీన్​ చెప్పారు. ఆల్​ఖైదా చైతుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు లేవని... ఇంటర్నెట్​ సదుపాయం కూడా తక్కువేనని స్పష్టం చేశారు. ఫలితంగానే వారు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారన్నారు.

ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండే ఆఫ్రికా సోమాలియాలో ఇప్పటికే 2800 పైగా కేసులు నమోదయ్యాయి. చాలా మందికి కరోనా అనేది దోమకాటువల్ల వస్తుందని, ఇది డయేరియా లాంటిదని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే కొన్ని అవగాహన కార్యక్రమాల వల్ల ఆఫ్రికాలోని చాలా దేశాలకు ఇప్పుడిప్పుడే కరోనా గురించిన సమాచారం చేరుతోందని బీన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: నీటి అడుగున ఉండే వీరికి కరోనా గురించి తెలియదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.