ETV Bharat / international

ఆహార పంపిణీలో తొక్కిసలాట.. 20 మంది బలి

ఆఫ్రికా నైజర్​లో తొక్కిసలాట కారణంగా 20మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆహార పదార్థాల పంపిణీ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Feb 18, 2020, 1:09 PM IST

Updated : Mar 1, 2020, 5:21 PM IST

Niger stampede kills 20 at handout for refugees
ఆహార పంపిణీలో తొక్కిసలాట.. 20మంది బలి

ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. దిప్ఫా పట్టణంలోని ఓ సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.

శరణార్థులకు ఆర్థికసాయం చేస్తుంటే..

నైజీరియా, చాద్‌ మధ్యనున్న ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది నైజీరియన్ శరణార్థులు, మరో లక్ష మంది వలసదారులు నివాసముంటున్నారు. సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన బోర్నో రాష్ట్ర గవర్నర్.. ఆహార పదార్థాలను, ఆర్థిక సాయాన్ని శరణార్థులకు అందించారు. వీటి కోసం వేలాదిమంది తరలిరాగా.. పంపిణీ చేసే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

రేషన్ కోసం సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి శరణార్థులు రావడం, అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా: చైనాలో 1,860కి చేరిన మృతులు

ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. దిప్ఫా పట్టణంలోని ఓ సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.

శరణార్థులకు ఆర్థికసాయం చేస్తుంటే..

నైజీరియా, చాద్‌ మధ్యనున్న ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది నైజీరియన్ శరణార్థులు, మరో లక్ష మంది వలసదారులు నివాసముంటున్నారు. సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన బోర్నో రాష్ట్ర గవర్నర్.. ఆహార పదార్థాలను, ఆర్థిక సాయాన్ని శరణార్థులకు అందించారు. వీటి కోసం వేలాదిమంది తరలిరాగా.. పంపిణీ చేసే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

రేషన్ కోసం సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి శరణార్థులు రావడం, అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా: చైనాలో 1,860కి చేరిన మృతులు

Last Updated : Mar 1, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.