దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రాన్ని మరింత ప్రమోట్ చెయ్యడం కోసం విదేశాల్లో ఇటీవలే ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. దీని కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అమెరికా వెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. అక్కడ ఈ సినిమా రీ రిలీజ్కు కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ అభిమానులు సినిమా టికెట్ల కోసం బారులు తీరుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలను చిత్రబృందం ట్విటర్లో పంచుకోగా అవి వైరల్గా మారాయి.
![RRR souring high as 1647-seater venue sold out in Los Angeles on 342nd day of RRR movie release](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17887504_movieee.jpg)
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ పెద్ద థియేటర్లో ఇటీవల ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. 1647 సీట్లు కలిగిన ఆ థియేటర్లో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతే కాకుండా తర్వాత షో కోసం వందల మంది ప్రేక్షకులు సినిమా హాలు బయట బారులు తీరారు. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్కు థియేటర్లోని ప్రేక్షకులు చిందులేశారు. సినిమా ప్రదర్శన అనంతరం చిత్రబృందం ఆడియన్స్తో మాట్లాడి సందడి చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
-
do you know Naatu?
— rachel kendra (@rachelxkendra) March 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
LA does.#RRR #RRRMoive #RRRforOscars pic.twitter.com/AsM1vA9nsj
">do you know Naatu?
— rachel kendra (@rachelxkendra) March 2, 2023
LA does.#RRR #RRRMoive #RRRforOscars pic.twitter.com/AsM1vA9nsjdo you know Naatu?
— rachel kendra (@rachelxkendra) March 2, 2023
LA does.#RRR #RRRMoive #RRRforOscars pic.twitter.com/AsM1vA9nsj
కాగా, ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్గ్లోబ్ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఆస్కార్ను కూడా గెలుచుకోవాలని సినీప్రియులు కోరుకుంటున్నారు.
అయితే మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన జరగనుంది. గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ను ఈ పాటను ఆస్కార్ వేదికపై ఆలపించనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ నిర్వాహకులు ఇటీవలే వెల్లడించారు. అది తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఆ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్లు స్టెప్పులేయాలని కోరుకుంటున్నారు.