Kollywood Heroes Red Card : కోలీవుడ్ స్టార్ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి బిగ్ షాక్ ఇవ్వనుంది! ధనుశ్, విశాల్, అథర్వ, శింబు లాంటి స్టార్ హీరోలకు రెడ్ కార్డు జారీ చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది
ప్రొడ్యూసర్ మైఖేల్ రాయప్పన్తో వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నారు. ఎందుకంటే ఈ వివాదంపై ఇప్పటికే చాలా సార్లు చర్చలు జరిపిన కూడా శింబు నుంచి ఎలాంటి మార్పు రావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిర్మాత అసోసియేషన్కు ప్రెసిడెంట్గా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్ ఫండ్స్ను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్ కార్డు జారి చేయనున్నారు. తెనందాల్ ప్రొడక్షన్ హౌస్లో ధనుశ్ ఓ సినిమాకు అంగీకరించారని.. 80 శాతం షూట్ పూర్తయ్యాక.. ఆ తర్వాత షూటింగ్ విషయంలో ఇంట్రెస్ట్ చూపలేదంట. దీంతో ఆ నిర్మాతకు నష్టాలు వచ్చినట్లు మండలి తెలిపింది. అందుకే ఆ కారణాన్ని చూపిస్తూ.. ధనుశ్పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక మదియలకన్ ప్రొడక్షన్ హౌస్తో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. కాకపోతే షూటింగ్ విషయంలో ఆయన ఏమాత్రం సహకరించడం లేదంటూ.. అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇకపోతే ప్రస్తుతం ధనుశ్, విశాల్, అథర్వ, శింబు.. ఈ నలుగురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ధనుశ్ త్వరలోనే కెప్టెన్ మిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రంలో నటించనున్నారు. విశాల్ మరో రోజులో(సెప్టెంబర్ 15) మార్క్ ఆంటోని చిత్రంతో అభిమానులను అలరించనున్నారు. ఆ తర్వాత తుప్పారివాలన్తో పాటు మరో చిత్రం చేస్తున్నారు. ఇక శింబు తన 48వ చిత్రంతో పాటు కరోనా కుమార్ అనే సినిమాలో నటిస్తున్నారు. అధ్వర.. అడ్రెస్, తనల్, నిరంగల్ మూండ్రు అనే సినిమాలు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్కు ఊరట.. ఆ రోజే 'మార్క్ ఆంటోని' రిలీజ్