ETV Bharat / entertainment

'మనకన్నా 'చోర్​ బజార్'​ దొంగలకే విలువలు ఎక్కువ'

author img

By

Published : Jun 21, 2022, 10:00 PM IST

సమాజంలోని దొంగల కన్నా చోర్​బజార్​లోని వారు 100 రెట్లు నయమని అన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి. మనతో పోలిస్తే వారికే విలువలు ఎక్కువ అని చెప్పారు. ఆకాష్ పూరి హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. సినిమా రిలీజ్​ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు జీవన్.

chor bazaar
chor bazaar director Jeevan Reddy
'మనకన్నా 'చోర్​ బజార్'​ దొంగలకే విలువలు ఎక్కువ'

చోర్​ బజార్​ అనేది వాస్తవానికి ఒక అద్భుతమైన రంగుల ప్రపంచమని అన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి. దానిని సినిమాగా ఎందుకు తీయకూడదు అనే ఆలోచనతోనే 'చోర్ ​బజార్'​ తెరకెక్కించినట్లు తెలిపారు. 'దళం', 'జార్జి రెడ్డి' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. యువ నటుడు ఆకాష్ పూరి, గెహనా సిప్పీ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించిన జీవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

chor bazaar
'చోర్​ బజార్'​

"నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పక్కా కమర్షియల్​ చిత్రం 'చోర్ ​బజార్'​. అందరూ మనుషులే అయినా చోర్​ బజార్​లోని వ్యక్తులు ఎందుకు విభిన్నంగా ఉంటారు? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది. అక్కడి వ్యక్తుల జీవన విధానం, సంఘటనలే నా కథా వస్తువు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా విలువలున్నవారు చోర్​బజార్​లోని వ్యక్తులు. మనం వ్యాపారం కోసం చేస్తే వారు అవసరం కోసం చేస్తారు. అదే పని వారు ఎదగడానికి చేస్తే.. వారి స్థాయి మాములుగా ఉండదు"

-జీవన్ రెడ్డి, దర్శకుడు

"చోర్​ బజార్​లో ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. మనం పగలు పనిచేసి, రాత్రి పడుకుంటాం. వారు పగలు చిన్నచిన్న దొంగతనాలు చేసి, రాత్రిళ్లు అమ్ముకుంటారు. మన సమాజంలోని దొంగలకన్నా వారు 100 రెట్లు నయం. అవసరం కోసం చేస్తున్నారు కాబట్టి వారినెవరూ దొంగలుగా భావించరు. వారిపై ఎలాంటి కేసులూ ఉండవు" అని జీవన్ రెడ్డి చెప్పారు.

chor bazaar
గెహనా సిప్పీ

ఆకాష్​ పూరిని ఈ సినిమాతో మరోసారి పరిచయం చేస్తున్నట్లు భావిస్తున్నానని జీవన్ చెప్పారు. చిత్రంలో హీరోయిన్​ మూగమ్మాయి పాత్రలో నటించినట్లు తెలిపారు. ఈ సినిమాకు సురేశ్​ బొబ్బిలి అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది.. టైటిల్​ ఇదే

'మనకన్నా 'చోర్​ బజార్'​ దొంగలకే విలువలు ఎక్కువ'

చోర్​ బజార్​ అనేది వాస్తవానికి ఒక అద్భుతమైన రంగుల ప్రపంచమని అన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి. దానిని సినిమాగా ఎందుకు తీయకూడదు అనే ఆలోచనతోనే 'చోర్ ​బజార్'​ తెరకెక్కించినట్లు తెలిపారు. 'దళం', 'జార్జి రెడ్డి' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. యువ నటుడు ఆకాష్ పూరి, గెహనా సిప్పీ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించిన జీవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

chor bazaar
'చోర్​ బజార్'​

"నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పక్కా కమర్షియల్​ చిత్రం 'చోర్ ​బజార్'​. అందరూ మనుషులే అయినా చోర్​ బజార్​లోని వ్యక్తులు ఎందుకు విభిన్నంగా ఉంటారు? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది. అక్కడి వ్యక్తుల జీవన విధానం, సంఘటనలే నా కథా వస్తువు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా విలువలున్నవారు చోర్​బజార్​లోని వ్యక్తులు. మనం వ్యాపారం కోసం చేస్తే వారు అవసరం కోసం చేస్తారు. అదే పని వారు ఎదగడానికి చేస్తే.. వారి స్థాయి మాములుగా ఉండదు"

-జీవన్ రెడ్డి, దర్శకుడు

"చోర్​ బజార్​లో ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. మనం పగలు పనిచేసి, రాత్రి పడుకుంటాం. వారు పగలు చిన్నచిన్న దొంగతనాలు చేసి, రాత్రిళ్లు అమ్ముకుంటారు. మన సమాజంలోని దొంగలకన్నా వారు 100 రెట్లు నయం. అవసరం కోసం చేస్తున్నారు కాబట్టి వారినెవరూ దొంగలుగా భావించరు. వారిపై ఎలాంటి కేసులూ ఉండవు" అని జీవన్ రెడ్డి చెప్పారు.

chor bazaar
గెహనా సిప్పీ

ఆకాష్​ పూరిని ఈ సినిమాతో మరోసారి పరిచయం చేస్తున్నట్లు భావిస్తున్నానని జీవన్ చెప్పారు. చిత్రంలో హీరోయిన్​ మూగమ్మాయి పాత్రలో నటించినట్లు తెలిపారు. ఈ సినిమాకు సురేశ్​ బొబ్బిలి అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది.. టైటిల్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.