ETV Bharat / entertainment

స్టార్​ దర్శకుడిని రిజెక్ట్​ చేసిన అల్లుఅర్జున్.. కారణమిదేనా?

author img

By

Published : May 17, 2022, 3:46 PM IST

'పుష్ప'తో పాన్​ ఇండియా స్టార్​గా మారిన హీరో అల్లుఅర్జున్​.. తన తదుపరి ప్రాజెక్ట్​ ఎవరితో చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. అయితే తాజాగా బన్నీ.. ఓ ప్రముఖ​ దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించారట! ఇంతకీ ఆ డైరెక్టర్​ ఎవరు? బన్నీ ఎందుకలా చేశారు? తెలుసుకుందాం...

alluarjun atlee movie
అల్లుఅర్జున్​ అట్లీ సినిమా

Alluarjun Atlee movie: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం 'పుష్పరాజ్‌'పై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఇచ్చిన కిక్​తో రెండో భాగం కోసం రెడీ అవుతున్న బన్నీ.. మరో పాన్‌ఇండియా సినిమా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్‌ డైరెక్టర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ పారితోషికాన్ని ఆఫర్​ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇటీవలే బయటకు వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో బన్నీ ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు, దానికి దర్శకుడిగా 'రాజారాణి', 'థేరి', 'మెర్సల్'​ చిత్రాలతో స్టార్​డమ్​ను సొంతం చేసుకున్న అట్లీని ఎంపిక చేయాలని చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అట్లీ-బన్నీ కాంబోలో సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం కనిపించట్లేదు. అల్లుఅర్జున్​.. అట్లీని పక్కనపెట్టారని తెలిసింది. ఎందుకంటే అట్లీ.. మూవీని తెరకెక్కించేందుకు ఏకంగా రూ.35కోట్లు పారితోషికం అడిగారట! దీంతో షాక్ అయిన బన్నీ.. అట్లీతో సినిమా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. సున్నితంగా ఆయన్ను సైడ్​ చేశారని టాక్ వినిపిస్తోంది​. మరి ఇందులో నిజమెంతో తెలియదుగాని ఈ విషయం గురించి తెగ కథనాలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఐకాన్​స్టార్​.. 'పుష్ప 2' చిత్రీకరణ కోసం సిద్ధమవుతుండగా.. దర్శకుడు అట్లీ.. షారుక్​ ఖాన్-​ నయనతారతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

Alluarjun Atlee movie: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం 'పుష్పరాజ్‌'పై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఇచ్చిన కిక్​తో రెండో భాగం కోసం రెడీ అవుతున్న బన్నీ.. మరో పాన్‌ఇండియా సినిమా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్‌ డైరెక్టర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ పారితోషికాన్ని ఆఫర్​ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇటీవలే బయటకు వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో బన్నీ ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు, దానికి దర్శకుడిగా 'రాజారాణి', 'థేరి', 'మెర్సల్'​ చిత్రాలతో స్టార్​డమ్​ను సొంతం చేసుకున్న అట్లీని ఎంపిక చేయాలని చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అట్లీ-బన్నీ కాంబోలో సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం కనిపించట్లేదు. అల్లుఅర్జున్​.. అట్లీని పక్కనపెట్టారని తెలిసింది. ఎందుకంటే అట్లీ.. మూవీని తెరకెక్కించేందుకు ఏకంగా రూ.35కోట్లు పారితోషికం అడిగారట! దీంతో షాక్ అయిన బన్నీ.. అట్లీతో సినిమా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. సున్నితంగా ఆయన్ను సైడ్​ చేశారని టాక్ వినిపిస్తోంది​. మరి ఇందులో నిజమెంతో తెలియదుగాని ఈ విషయం గురించి తెగ కథనాలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఐకాన్​స్టార్​.. 'పుష్ప 2' చిత్రీకరణ కోసం సిద్ధమవుతుండగా.. దర్శకుడు అట్లీ.. షారుక్​ ఖాన్-​ నయనతారతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

ఇదీ చూడండి: పవన్​ 'ఖుషి', చిరంజీవి 'మేజర్'- అవే సినిమా పేర్లు.. కానీ హీరోలు ఛేంజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.