ETV Bharat / crime

'నేను చనిపోతున్నా'.. అంటూ వాట్సాప్ స్టేటస్​ పెట్టి ఆత్మహత్య

author img

By

Published : Feb 20, 2021, 12:32 PM IST

'నాకు జీవితం మీద విరక్తి పుట్టింది... నేను చనిపోతున్నా... నన్ను క్షమించండి...' అంటూ ఓ వ్యక్తి ఉరితాడుతో సెల్ఫీ దిగి వాట్సాప్​లో స్టేటస్​ పెట్టాడు. అనంతరం ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

Young man commits suicide by putting up WhatsApp status at atmakur in yadadri bhongir district
'నేను చనిపోతున్నా'.. అంటూ వాట్సాప్ స్టేటస్​ పెట్టి ఆత్మహత్య

'నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి..' అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. మెడకు ఉరితాడు వేసుకున్న స్వీయచిత్రం దిగి స్నేహితులకు పంపాడు. 'ఆత్మహత్య చేసుకుంటున్నాన'ని వారికి చరవాణిలో చెప్పి ఉరివేసుకుని యువకుడు బలవన్మరణం చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో శుక్రవారం చోటుచేసుకుంది.

మండలకేంద్రానికి చెందిన బందారపు రమేష్‌(24) స్థానికంగా ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రంలో పనిచేస్తున్నారు. స్నేహితులకు ఫోన్‌ చేసి 'తాను ఇన్ని రోజులు పేదరికంలోనే జీవించాలని, జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడుతున్నాన'ని చెప్పి ఆత్మకూరు వీర్ల చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొన్నారు. స్నేహితులు వెతుక్కుంటూ వచ్చే సరికి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. సర్దిచెబుతున్నా వినకుండా ప్రాణాలు తీసుకొన్నాడని స్నేహితులు రోదించారు. మృతుడి తల్లి ఆండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఇద్రిస్‌ అలీ తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం.. మృతదేహాన్ని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.

'నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి..' అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. మెడకు ఉరితాడు వేసుకున్న స్వీయచిత్రం దిగి స్నేహితులకు పంపాడు. 'ఆత్మహత్య చేసుకుంటున్నాన'ని వారికి చరవాణిలో చెప్పి ఉరివేసుకుని యువకుడు బలవన్మరణం చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో శుక్రవారం చోటుచేసుకుంది.

మండలకేంద్రానికి చెందిన బందారపు రమేష్‌(24) స్థానికంగా ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రంలో పనిచేస్తున్నారు. స్నేహితులకు ఫోన్‌ చేసి 'తాను ఇన్ని రోజులు పేదరికంలోనే జీవించాలని, జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడుతున్నాన'ని చెప్పి ఆత్మకూరు వీర్ల చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొన్నారు. స్నేహితులు వెతుక్కుంటూ వచ్చే సరికి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. సర్దిచెబుతున్నా వినకుండా ప్రాణాలు తీసుకొన్నాడని స్నేహితులు రోదించారు. మృతుడి తల్లి ఆండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఇద్రిస్‌ అలీ తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం.. మృతదేహాన్ని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.