ETV Bharat / crime

Suicide: ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య.. హత్యేనని ఆరోపణ.!

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ తన నివాసంలో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించడంతో భర్తే చంపి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jun 24, 2021, 12:39 PM IST

woman suspicious suicide in thorrur
తొర్రూరులో మహిళ ఆత్మహత్య

ఉరితాడుకు వేలాడుతూ ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. రాజీవ్​ నగర్​ కాలనీలో నివసించే జయంతి.. ఉరివేసుకొని మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే చంపి ఉరేశాడని ఆరోపిస్తున్నారు.

కేసముద్రం మండలం పెద్ద మోరియా తండాకు చెందిన జయంతి(31), ధర్మారం తండాకు చెందిన సురేష్​తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొర్రూరులోని రాజీవ్​నగర్​లో దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్​ రైసుమిల్లులో పనిచేస్తుండగా, జయంతి షాపింగ్​మాల్​లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు శ్రీ వర్ధన్​(5), సాయి సమిత్​(4).

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!

ఉరితాడుకు వేలాడుతూ ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. రాజీవ్​ నగర్​ కాలనీలో నివసించే జయంతి.. ఉరివేసుకొని మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే చంపి ఉరేశాడని ఆరోపిస్తున్నారు.

కేసముద్రం మండలం పెద్ద మోరియా తండాకు చెందిన జయంతి(31), ధర్మారం తండాకు చెందిన సురేష్​తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొర్రూరులోని రాజీవ్​నగర్​లో దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్​ రైసుమిల్లులో పనిచేస్తుండగా, జయంతి షాపింగ్​మాల్​లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు శ్రీ వర్ధన్​(5), సాయి సమిత్​(4).

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.