ETV Bharat / crime

Suicide: ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య.. హత్యేనని ఆరోపణ.! - woman suspicious suicide in thorrur

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ తన నివాసంలో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించడంతో భర్తే చంపి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

woman suspicious suicide in thorrur
తొర్రూరులో మహిళ ఆత్మహత్య
author img

By

Published : Jun 24, 2021, 12:39 PM IST

ఉరితాడుకు వేలాడుతూ ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. రాజీవ్​ నగర్​ కాలనీలో నివసించే జయంతి.. ఉరివేసుకొని మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే చంపి ఉరేశాడని ఆరోపిస్తున్నారు.

కేసముద్రం మండలం పెద్ద మోరియా తండాకు చెందిన జయంతి(31), ధర్మారం తండాకు చెందిన సురేష్​తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొర్రూరులోని రాజీవ్​నగర్​లో దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్​ రైసుమిల్లులో పనిచేస్తుండగా, జయంతి షాపింగ్​మాల్​లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు శ్రీ వర్ధన్​(5), సాయి సమిత్​(4).

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!

ఉరితాడుకు వేలాడుతూ ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. రాజీవ్​ నగర్​ కాలనీలో నివసించే జయంతి.. ఉరివేసుకొని మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే చంపి ఉరేశాడని ఆరోపిస్తున్నారు.

కేసముద్రం మండలం పెద్ద మోరియా తండాకు చెందిన జయంతి(31), ధర్మారం తండాకు చెందిన సురేష్​తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొర్రూరులోని రాజీవ్​నగర్​లో దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్​ రైసుమిల్లులో పనిచేస్తుండగా, జయంతి షాపింగ్​మాల్​లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు శ్రీ వర్ధన్​(5), సాయి సమిత్​(4).

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.