ETV Bharat / crime

వాహనం ఢీ.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

author img

By

Published : Apr 9, 2021, 11:31 AM IST

టాటా ఏస్​ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

kodad accident news, suryapet accident news
వాహనం ఢీ.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

సూర్యాపేట జిల్లా కోదాడ 65వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం టాటా ఏస్​ వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిద్ధిపేట జిల్లా తెలుగుపల్లికి చెందిన అన్వేష్​గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కోదాడ బైపాస్​ వద్ద ప్రమాదం జరిగింది.

వేగంగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడు అన్వేష్, తీవ్రగాయలైన రాహుల్​ను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ 65వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం టాటా ఏస్​ వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిద్ధిపేట జిల్లా తెలుగుపల్లికి చెందిన అన్వేష్​గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కోదాడ బైపాస్​ వద్ద ప్రమాదం జరిగింది.

వేగంగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడు అన్వేష్, తీవ్రగాయలైన రాహుల్​ను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి : పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.