ETV Bharat / crime

విషాదం: ఈతకు వెళ్లి సముద్రంలో గల్లంతు.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 21, 2021, 9:23 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా రామాపురంలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.

two-persons-death-one-person-missing-in-prakasam-district in AP
విషాదం: ఈతకు వెళ్లి సముద్రంలో గల్లంతు.. ఇద్దరు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కట్టవారిపాలెం సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే..

గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కట్టవారిపాలెం తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.

ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. దాదాపు అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేటపాలెం ఎస్సై కమలాకర్ సంఘటనా స్థలిని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను చీరాల వైద్యశాలకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రభుత్వమే చేయలేనప్పుడు.. ప్రైవేటు వాళ్లెలా చేస్తారు?: నాదెండ్ల

ఏపీలోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కట్టవారిపాలెం సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే..

గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కట్టవారిపాలెం తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.

ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. దాదాపు అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేటపాలెం ఎస్సై కమలాకర్ సంఘటనా స్థలిని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను చీరాల వైద్యశాలకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రభుత్వమే చేయలేనప్పుడు.. ప్రైవేటు వాళ్లెలా చేస్తారు?: నాదెండ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.