ETV Bharat / crime

Road accident: ఆటో- కారు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం - mahabubnagar district news

Road accident: ఆటో- కారు ఢీ.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
Road accident: ఆటో- కారు ఢీ.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
author img

By

Published : Dec 9, 2021, 6:30 PM IST

Updated : Dec 9, 2021, 8:02 PM IST

18:27 December 09

ఆటో- కారు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓబులాయపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో బలంగా ఢీ కొనడంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స తరలిస్తుండగా చనిపోయారు. గాయపడిన వారంతా దేవరకద్ర ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు.

ఘటనాస్థలంలో ఎంపీడీవో అటెండర్‌ విజయరాణి, ఆటోడ్రైవర్‌ మృతి చెందగా ఎంపీడీవో ఆఫీస్‌ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కంప్యూటర్ ఆపరేటర్‌ శ్రీలత, మరో అటెండర్ ఖాజాకు తీవ్రగాయాలు కాగా.. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం పట్ల మంత్రి దిగ్భ్రాంతి

కారు మరికల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి:

Accident in Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి

18:27 December 09

ఆటో- కారు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓబులాయపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో బలంగా ఢీ కొనడంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స తరలిస్తుండగా చనిపోయారు. గాయపడిన వారంతా దేవరకద్ర ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు.

ఘటనాస్థలంలో ఎంపీడీవో అటెండర్‌ విజయరాణి, ఆటోడ్రైవర్‌ మృతి చెందగా ఎంపీడీవో ఆఫీస్‌ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కంప్యూటర్ ఆపరేటర్‌ శ్రీలత, మరో అటెండర్ ఖాజాకు తీవ్రగాయాలు కాగా.. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం పట్ల మంత్రి దిగ్భ్రాంతి

కారు మరికల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి:

Accident in Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి

Last Updated : Dec 9, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.