ETV Bharat / crime

wife killed husband: భర్త మర్మాంగంపై కొట్టి చంపిన భార్య!

కట్టుకున్న భర్తనే అతి క్రూరంగా హతమార్చి.. సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఓ ఇల్లాలు. మద్యం మత్తులో ఇంటిపై నుంచి పడిపోయాడని పోలీసులకు తనే సమాచారం అందించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

author img

By

Published : Aug 11, 2021, 9:25 PM IST

murder
murder

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య.. తన భర్తను మర్మాంగంపై కొట్టి చంపేసింది. మద్యం మత్తులో ఇంటిపై నుంచి పడి తన భర్త చనిపోయాడని పోలీసులను, స్థానికులను నమ్మించిది. కానీ పోలీసులు దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.

పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. కొంతకాలం తర్వాత భర్త మద్యానికి బానిస అయ్యి.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. భర్త తీరుతో విసిగిపోయిన రేఖ.. కేశవ మర్మాంగంపై కొట్టి చంపిందని తెలుస్తోంది.

కేశవ మరణంపై అతడి తల్లి అనుమానం వ్యక్తం చేయగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మర్మాంగం మీద కొట్టడంతోనే కేశవ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

ఇదీ చూడండి: MURDER: వ్యాపారి హత్య కేసులో పురోగతి​.. అసలెందుకు చంపారంటే..?

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య.. తన భర్తను మర్మాంగంపై కొట్టి చంపేసింది. మద్యం మత్తులో ఇంటిపై నుంచి పడి తన భర్త చనిపోయాడని పోలీసులను, స్థానికులను నమ్మించిది. కానీ పోలీసులు దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.

పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. కొంతకాలం తర్వాత భర్త మద్యానికి బానిస అయ్యి.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. భర్త తీరుతో విసిగిపోయిన రేఖ.. కేశవ మర్మాంగంపై కొట్టి చంపిందని తెలుస్తోంది.

కేశవ మరణంపై అతడి తల్లి అనుమానం వ్యక్తం చేయగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మర్మాంగం మీద కొట్టడంతోనే కేశవ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

ఇదీ చూడండి: MURDER: వ్యాపారి హత్య కేసులో పురోగతి​.. అసలెందుకు చంపారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.