ETV Bharat / crime

స్నానానికి వెళ్లి.. గల్లంతైన విద్యార్థి

author img

By

Published : Mar 19, 2021, 7:53 PM IST

మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో సిద్ధాపూర్ సమీపంలో చోటుచేసుకుంది.

The student lost in canal who went to take a bath in Nirmal
స్నానానికి వెళ్లి.. గల్లంతైన విద్యార్థి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీపురానికి చెందిన కదం వంశీ(15) అనే విద్యార్థి శుక్రవారం తన మిత్రులతో కలిసి సిద్ధాపూర్ సమీపంలోని సరస్వతీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వంశీ గల్లంతయ్యాడు. భయాందోళన చెందిన మిత్రులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

The student lost in canal who went to take a bath in Nirmal
గల్లంతైన విద్యార్థి కదం వంశీ

హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానికులు వంశీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులకు సమాచారం అందించి ప్రవాహాన్ని నిలిపివేశారు. కాలువ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీపురానికి చెందిన కదం వంశీ(15) అనే విద్యార్థి శుక్రవారం తన మిత్రులతో కలిసి సిద్ధాపూర్ సమీపంలోని సరస్వతీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వంశీ గల్లంతయ్యాడు. భయాందోళన చెందిన మిత్రులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

The student lost in canal who went to take a bath in Nirmal
గల్లంతైన విద్యార్థి కదం వంశీ

హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానికులు వంశీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులకు సమాచారం అందించి ప్రవాహాన్ని నిలిపివేశారు. కాలువ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.