మతిస్తిమితం లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్లోని మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కస్తూర్భా గాంధీ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు 12న ఇంటి నుంచి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వృద్ధురాలి మనవడు చేసిన ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మమ్మ మతిస్తిమితం సరిగ్గా లేని కారణంగానే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: దారుణం: కత్తితో ఉన్మాది దాడి.. యువతి మృతి