ETV Bharat / crime

కరెంటు వైర్లు తగిలి.. పశుగ్రాసం, ట్రాక్టర్​ దగ్ధం

విద్యుత్ వైర్లు తగిలి పశుగ్రాసం, ట్రాక్టర్ దగ్ధమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

author img

By

Published : Apr 5, 2021, 3:45 PM IST

fodder and tractor burnt
పశుగ్రాసం, ట్రాక్టర్​ దగ్ధం

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్​ వైర్లు వేలాడి ఉండటంతో పశుగ్రాసం తీసుకొని వెళుతున్న ట్రాక్టర్​కు తీగలు తగిలి గడ్డితో పాటు వాహనం సైతం మంటల్లో కాలిపోయింది. పెద్ద దగడ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి.. గోపాలపురంలోని ఓ రైతు వద్ద పశువులకు గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్​లో నింపుకున్నాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా జటప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఘటనలో గడ్డితో పాటు ట్రాక్టర్ దగ్ధమైంది.

ప్రమాదంలో రూ. 3 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ఫలితం లేదని వాపోయాడు.

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్​ వైర్లు వేలాడి ఉండటంతో పశుగ్రాసం తీసుకొని వెళుతున్న ట్రాక్టర్​కు తీగలు తగిలి గడ్డితో పాటు వాహనం సైతం మంటల్లో కాలిపోయింది. పెద్ద దగడ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి.. గోపాలపురంలోని ఓ రైతు వద్ద పశువులకు గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్​లో నింపుకున్నాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా జటప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఘటనలో గడ్డితో పాటు ట్రాక్టర్ దగ్ధమైంది.

ప్రమాదంలో రూ. 3 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ఫలితం లేదని వాపోయాడు.

ఇదీ చదవండి: సరుకులు కొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.