ETV Bharat / crime

బాత్రూంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

చెడు అలవాట్లు.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఇద్దరు పిల్లలను అనాథలుగా మిగిల్చాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త.. ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

author img

By

Published : Feb 23, 2021, 5:45 AM IST

The husband who chopped his wife to death with an ax in the bathroom in jagityal
బాత్రూంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో జరిగింది. చర్లపల్లికి చెందిన ఆశినేని శంకరయ్య(45) ముంబయిలోని కల్లు దుకాణంలో పని చేస్తున్నాడు. అతని భార్య సుజాత(37).. తన ఇద్దరి పిల్లలతో స్వగ్రామంలోనే ఉంటోంది. శంకరయ్మ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అనుమానంతో.. మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.

రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన శంకరయ్య.. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు భార్యతో గొడవపడ్డాడు. సోమవారం తెల్లవారుజామున.. భార్య బాత్​రూమ్​కు వెళ్లడం గమనించి.. పథకం ప్రకారం గొడ్డలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శంకరయ్య ఉదయం వరకు మృతదేహం పక్కనే కూర్చుండిపోయాడు. నిద్ర లేచిన పిల్లలు జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించారు.

మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఇదివరకే వివాహమై.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: అశ్వారావుపేటలో క్షుద్ర పూజల కలకలం

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో జరిగింది. చర్లపల్లికి చెందిన ఆశినేని శంకరయ్య(45) ముంబయిలోని కల్లు దుకాణంలో పని చేస్తున్నాడు. అతని భార్య సుజాత(37).. తన ఇద్దరి పిల్లలతో స్వగ్రామంలోనే ఉంటోంది. శంకరయ్మ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అనుమానంతో.. మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.

రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన శంకరయ్య.. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు భార్యతో గొడవపడ్డాడు. సోమవారం తెల్లవారుజామున.. భార్య బాత్​రూమ్​కు వెళ్లడం గమనించి.. పథకం ప్రకారం గొడ్డలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శంకరయ్య ఉదయం వరకు మృతదేహం పక్కనే కూర్చుండిపోయాడు. నిద్ర లేచిన పిల్లలు జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించారు.

మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఇదివరకే వివాహమై.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: అశ్వారావుపేటలో క్షుద్ర పూజల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.