ETV Bharat / crime

కాలువలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యం - young man dead body found in Kakatiya canal

ఈతకొట్టడానికి వెళ్లిన యువకుడు గురువారం నాడు కాకతీయ కాలువలో కొట్టుకపోగా.. నేడు అతని మృతదేహం లభ్యమైంది. ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన కార్తిక్ శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానికుల సహాయంతో వెలికితీశారు.

కాకతీయకాలువలో యువకుడి మృతదేహం లభ్యం
young man dead body found in Kakatiya canal
author img

By

Published : Apr 2, 2021, 8:19 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లసుమన్నపల్లి గ్రామ పరిధిలోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ వద్ద ముజ్జిగ కార్తీక్ శవం కాలువలో తేలడాన్ని గమనించిన పోలీసుసు స్థానికుల సహాయంతో నీటి నుంచి బయటకు తీశారు.

కాకతీయ కాలువలో గురువారం ఈతకు వెళ్లిన కార్తిక్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఎల్కతుర్తి మండల సమీపంలోని అనంతసాగర్ గ్రామం వద్ద కాలువలో మృతదేహం కనిపించింది. స్థానికుల సహాయంతో శవాన్ని వెలికితీసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లసుమన్నపల్లి గ్రామ పరిధిలోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ వద్ద ముజ్జిగ కార్తీక్ శవం కాలువలో తేలడాన్ని గమనించిన పోలీసుసు స్థానికుల సహాయంతో నీటి నుంచి బయటకు తీశారు.

కాకతీయ కాలువలో గురువారం ఈతకు వెళ్లిన కార్తిక్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఎల్కతుర్తి మండల సమీపంలోని అనంతసాగర్ గ్రామం వద్ద కాలువలో మృతదేహం కనిపించింది. స్థానికుల సహాయంతో శవాన్ని వెలికితీసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మంత్రి అజయ్​కుమార్​ ఎంత దుర్మార్గుడంటే... ప్రశాంత్​రెడ్డి సెటైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.