ETV Bharat / crime

కాగజ్​నగర్​లో టాస్క్​ఫోర్స్​ పోలీసుల తనిఖీలు.. ఇద్దరిపై కేసు నమోదు - Task force police inspections at Kagaznagar

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో నిషేధిత గుట్కా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.50 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, రూ.7 వేల విలువ గల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Task force police inspections in Kagaznagar
Task force police inspections in Kagaznagar
author img

By

Published : May 8, 2021, 7:24 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.50 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, రూ.7 వేల విలువ గల పటికను స్వాధీనం చేసుకున్నారు.

కాగజ్​నగర్ పట్టణంలోని తెలంగాణ ట్రాన్స్​పోర్ట్ ద్వారా నిషేధిత గుట్కా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేపట్టినట్లు టాస్క్​ఫోర్స్​ సీఐ రానా ప్రతాప్​ పేర్కొన్నారు. ఈ సోదాల్లో కిరాణ వ్యాపారి ఇంతియాజ్​కు చెందిన రూ.50 వేల విలువ గల తంబాకు సంచులు, మరో వ్యాపారి నవీన్​కు చెందిన 7 వేల విలువ గల పటిక సంచులు లభ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి.. స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించినట్లు వివరించారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.50 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, రూ.7 వేల విలువ గల పటికను స్వాధీనం చేసుకున్నారు.

కాగజ్​నగర్ పట్టణంలోని తెలంగాణ ట్రాన్స్​పోర్ట్ ద్వారా నిషేధిత గుట్కా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేపట్టినట్లు టాస్క్​ఫోర్స్​ సీఐ రానా ప్రతాప్​ పేర్కొన్నారు. ఈ సోదాల్లో కిరాణ వ్యాపారి ఇంతియాజ్​కు చెందిన రూ.50 వేల విలువ గల తంబాకు సంచులు, మరో వ్యాపారి నవీన్​కు చెందిన 7 వేల విలువ గల పటిక సంచులు లభ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి.. స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: కరోనా బారినపడి నీలోఫర్ ఆస్పత్రి హెడ్​నర్స్ మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.