ETV Bharat / crime

లాక్​డౌన్ వేళ పాతబస్తీ రౌడీషీటర్ దారుణ హత్య

author img

By

Published : May 21, 2021, 10:47 AM IST

లాక్​డౌన్​ వేళ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో దారుణ హత్య జరిగింది. రాడ్లు, బండరాళ్లతో దుండగలు పాతబస్తీ రౌడీషీటర్​ను హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

rowdy-sheeter-brutally-murdered-in-patabasti-hyderabad
లాక్​డౌన్ వేళ పాతబస్తీ రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్​లోని బహదూర్‌పురా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కిషన్​బాగ్​లో రౌడీషీటర్‌ ఐజాజ్​ని దుండగులు హతమార్చారు. ఐజాజ్ ఇంటి సమీపంలోనే రాడ్​లు, బండ రాళ్లతో మోదీ.. హత్య చేసి పరారయ్యారు. మృతుడు గతంలో ఫలక్​నుమాలో మొహమ్మద్ ఫిరోజ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్​ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్​లోని బహదూర్‌పురా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కిషన్​బాగ్​లో రౌడీషీటర్‌ ఐజాజ్​ని దుండగులు హతమార్చారు. ఐజాజ్ ఇంటి సమీపంలోనే రాడ్​లు, బండ రాళ్లతో మోదీ.. హత్య చేసి పరారయ్యారు. మృతుడు గతంలో ఫలక్​నుమాలో మొహమ్మద్ ఫిరోజ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్​ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటుకు చిరంజీవి నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.