ETV Bharat / crime

కారు, బైక్​ ఢీ... ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన ఏపీ గుంటూరు జిల్లా వేములూరిపాడు వద్ద జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

author img

By

Published : May 10, 2021, 1:31 PM IST

accident
accident

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా వేములూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిరంగిపురం మంటలం తాళ్లూరుకు చెందిన షేక్ చిన మస్తాన్ అతని భార్య నూర్జహాన్, కుమారుడు హుసేన్​తో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయల్దేరారు.

వేములూరిపాడు పరిధిలోని తులసీ సీడ్స్ కంపెనీ వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న కారు... వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. ఒకే కుంటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా వేములూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిరంగిపురం మంటలం తాళ్లూరుకు చెందిన షేక్ చిన మస్తాన్ అతని భార్య నూర్జహాన్, కుమారుడు హుసేన్​తో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయల్దేరారు.

వేములూరిపాడు పరిధిలోని తులసీ సీడ్స్ కంపెనీ వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న కారు... వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. ఒకే కుంటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: కరోనా సంంధ్రఆక్షణ కేంద్రానికి అమితాబ్​ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.