ETV Bharat / crime

Accident: కారు, లారీ ఢీ.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీ కొని ఇద్దరు చనిపోయారు.

car accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 21, 2021, 12:33 PM IST

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు కృష్ణా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు కృష్ణా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.