ETV Bharat / crime

పెళ్లి.. ఇంతలోనే సినీఫక్కీలో వధువు కిడ్నాప్!

author img

By

Published : Apr 2, 2021, 1:12 PM IST

పెద్దలు కుదిర్చిన సంబంధం.. ఇరువర్గాల మధ్య వివిధ కారణాలతో విభేదాల వల్ల పెళ్లి కుదరలేదు. యువతీ యువకులు మాత్రం తరచూ ఫోన్​లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. బంధువుల సహాయంతో హైదరాబాద్ సైదాబాద్​లోని ఆర్యసమాజ్​లో గత నెల 30న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వధువును ఆమె తల్లిదండ్రులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Relatives kidnapped the bride in yadadri district
పెళ్లి.. ఇంతలోనే సినీఫక్కీలో వధువు కిడ్నాప్!

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన ఓ యువతి, చౌటుప్పల్​ మండాలనికి చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధం కుదిర్చారు. కొన్ని కారణాలతో ఆ పెళ్లి సంబంధం రద్దైంది. తర్వాత ప్రేమించుకున్న యువతీ, యువకుడు ఆర్యసమాజ్​లో వివాహం చేసుకుని చౌటుప్పల్ పీఎస్​ను ఆశ్రయించారు. అంతకు ముందే తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు భువనగిరి గ్రామీణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నూతన వధూవరులను భువనగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​కి బుధవారం పిలిపించారు. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

వధూవరులు ఇద్దరూ మేజర్​లు కావటం వల్ల యువకుడికి, వధువును అప్పగించి స్వగ్రామానికి పోలీసుల బందోబస్తుతో పంపించారు. మార్గమధ్యలో భువనగిరి మండలం నందనం గ్రామంలో వరుడి కారును, వధువు తరుఫు బంధువులు అడ్డగించి దాడికి పాల్పడి.. వధువును తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట, ఆత్మకూరులో తిరిగి రాయగిరి వైపు వస్తుండగా వీరవెల్లి వద్ద నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్​కి పంపినట్లు భువనగిరి గ్రామీణ ఎస్ఐ సైదులు తెలిపారు. వధువును, వరుడికి అప్పగించినట్లు చెప్పారు.

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన ఓ యువతి, చౌటుప్పల్​ మండాలనికి చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధం కుదిర్చారు. కొన్ని కారణాలతో ఆ పెళ్లి సంబంధం రద్దైంది. తర్వాత ప్రేమించుకున్న యువతీ, యువకుడు ఆర్యసమాజ్​లో వివాహం చేసుకుని చౌటుప్పల్ పీఎస్​ను ఆశ్రయించారు. అంతకు ముందే తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు భువనగిరి గ్రామీణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నూతన వధూవరులను భువనగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​కి బుధవారం పిలిపించారు. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

వధూవరులు ఇద్దరూ మేజర్​లు కావటం వల్ల యువకుడికి, వధువును అప్పగించి స్వగ్రామానికి పోలీసుల బందోబస్తుతో పంపించారు. మార్గమధ్యలో భువనగిరి మండలం నందనం గ్రామంలో వరుడి కారును, వధువు తరుఫు బంధువులు అడ్డగించి దాడికి పాల్పడి.. వధువును తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట, ఆత్మకూరులో తిరిగి రాయగిరి వైపు వస్తుండగా వీరవెల్లి వద్ద నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్​కి పంపినట్లు భువనగిరి గ్రామీణ ఎస్ఐ సైదులు తెలిపారు. వధువును, వరుడికి అప్పగించినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.