రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సమీపంలోని ఓ కుంటలో అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జలాల్బాబా నగర్లో నివాసముంటున్న అబ్దుల్ రహీం, తబస్సుమ్ దంపతుల కుమారుడు బాబు బాకర్.. శుక్రవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిన్నారి కోసం రెండో రోజు తల్లిదండ్రులు, పోలీసులు గాలిస్తుండగా.. సమీపంలోని కుంటలో చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా బాలుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: MALLAREDDY: 'రేవంత్ బ్లాక్మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'