ETV Bharat / crime

దారుణ హత్యకు గురైన రైల్వే ఉద్యోగి.. కేసు నమోదు - medchal district crime news

ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

railway employee murdered
railway employee murdered
author img

By

Published : May 8, 2021, 7:18 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజగిరి సంతోశ్​రెడ్డి నగర్​లో దారుణం చోటుచేసుకుంది. మల్కాజగిరి సూర్యప్రభ అపార్ట్​మెంట్​లో నివాసముండే రైల్వే ఉద్యోగి విజయ్​కుమార్​రెడ్డి అనే వ్యక్తిని ఓ గుర్తుతెలియని దుండగుడు హత్య చేశాడు.

విజయ్​కుమార్​రెడ్డి తల్లికి కరోనా సోకడంతో ఈరోజు ఉదయం తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించి.. తిరిగి ఇంటికొచ్చాడు. అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో విజయ్​కుమార్​రెడ్డి మెడపై నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. మీ సేవా కేంద్రంలో దొంగతనం... 25 వేలు మాయం

మేడ్చల్ జిల్లా మల్కాజగిరి సంతోశ్​రెడ్డి నగర్​లో దారుణం చోటుచేసుకుంది. మల్కాజగిరి సూర్యప్రభ అపార్ట్​మెంట్​లో నివాసముండే రైల్వే ఉద్యోగి విజయ్​కుమార్​రెడ్డి అనే వ్యక్తిని ఓ గుర్తుతెలియని దుండగుడు హత్య చేశాడు.

విజయ్​కుమార్​రెడ్డి తల్లికి కరోనా సోకడంతో ఈరోజు ఉదయం తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించి.. తిరిగి ఇంటికొచ్చాడు. అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో విజయ్​కుమార్​రెడ్డి మెడపై నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. మీ సేవా కేంద్రంలో దొంగతనం... 25 వేలు మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.