హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన చిన్న శీను (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్ వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం దవాఖానాలో చేరాడు.
కాగా అదే సాయంత్రం డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చేజారిందని వివరించారు. రేబిస్ వార్డులో వెంటనే ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్లకుంట పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళలు పోలీస్ స్టేషన్కు రాకుండా కోడ్ ద్వారా ఫిర్యాదు