ETV Bharat / crime

కాసేపట్లో పోలీసు కస్టడీకి కిడ్నాప్​ కేసు నిందితులు

author img

By

Published : Jan 20, 2021, 11:45 AM IST

బోయిన్​పల్లి అపహరణ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్లికార్జున్ రెడ్డి, బోయ సంపత్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్​పల్లి ఠాణాకు తరలించనున్నారు.

Police who took the kidnapping case suspects into custody
పోలీసు కస్టడీకి కిడ్నాప్​ కేసు నిందితులు

కిడ్నాప్​ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్లికార్జున్ రెడ్డి, బోయ సంపత్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్​పల్లి ఠాణాకు తరలించనున్నారు. మూడు రోజుల పాటు ఇద్దరు నిందితులను ప్రశ్నించి వారి నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. ఇద్దరు నిందితులు కలిసి ఈనెల 2న మియాపూర్​లోని ఓ మొబైల్ దుకాణంలో ఆరు చరవాణిలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 6 చరవాణిలను ఉపయోగించే.. అపహరణ సందర్భంగా సంభాషించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు నిందితులను ప్రశ్నించడం ద్వారా... భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై బోయిన్​పల్లి పోలీసులు.. నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఆమెకు సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించటంతో.. సికింద్రాబాద్ ఎంఎస్​జే కోర్టులో ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విఖ్యాత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ అపహరణ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ప్రధాన నిందితులు అఖిలప్రియతో కలిపి 19మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుతో పాటు ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: పీఎఫ్​ క్లెయిమ్​ కోసం లంచం... సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి

కిడ్నాప్​ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్లికార్జున్ రెడ్డి, బోయ సంపత్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్​పల్లి ఠాణాకు తరలించనున్నారు. మూడు రోజుల పాటు ఇద్దరు నిందితులను ప్రశ్నించి వారి నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. ఇద్దరు నిందితులు కలిసి ఈనెల 2న మియాపూర్​లోని ఓ మొబైల్ దుకాణంలో ఆరు చరవాణిలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 6 చరవాణిలను ఉపయోగించే.. అపహరణ సందర్భంగా సంభాషించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు నిందితులను ప్రశ్నించడం ద్వారా... భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై బోయిన్​పల్లి పోలీసులు.. నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఆమెకు సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించటంతో.. సికింద్రాబాద్ ఎంఎస్​జే కోర్టులో ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విఖ్యాత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ అపహరణ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ప్రధాన నిందితులు అఖిలప్రియతో కలిపి 19మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుతో పాటు ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: పీఎఫ్​ క్లెయిమ్​ కోసం లంచం... సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.