అక్రమంగా తరలిస్తోన్న 198 కిలోల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 29,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా సరిహద్దు నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది.
ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కుటుంబీకుల ఆందోళన