ETV Bharat / crime

రూ. 29 లక్షల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Mar 31, 2021, 2:16 PM IST

భద్రాచలంలో భారీగా నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్​ చెక్​పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 198 కిలోల గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Marijuana seized in bhadrachalam
భద్రాచలంలో గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తోన్న 198 కిలోల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్​ చెక్​పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 29,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా సరిహద్దు నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది.

అక్రమంగా తరలిస్తోన్న 198 కిలోల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్​ చెక్​పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 29,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా సరిహద్దు నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది.

ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కుటుంబీకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.