ETV Bharat / crime

వేర్వేరు చోట్ల తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

author img

By

Published : Jun 18, 2021, 11:57 AM IST

ములుగు జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

pds rice, mulugu
రేషన్ బియ్యం పట్టివేత, ములుగు

ములుగు జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసులు నిర్వహించిన సోదాల్లో రేషన్ బియ్యం భారీగా పట్టబడ్డాయి. జిల్లాకేంద్రంలోని గొల్లవాడ వీధిలో ఎండీ రఫీ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 19 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. పౌర సరఫరాల శాఖకు అప్పగించినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు.

వెంకటాపూర్ మండలం గుర్రంపేట గ్రామంలో మహమ్మద్ మోహిద్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. 20 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

ములుగు జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసులు నిర్వహించిన సోదాల్లో రేషన్ బియ్యం భారీగా పట్టబడ్డాయి. జిల్లాకేంద్రంలోని గొల్లవాడ వీధిలో ఎండీ రఫీ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 19 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. పౌర సరఫరాల శాఖకు అప్పగించినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు.

వెంకటాపూర్ మండలం గుర్రంపేట గ్రామంలో మహమ్మద్ మోహిద్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. 20 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

ఇదీ చదవండి: వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు విలువచేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.