ETV Bharat / crime

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - Suryapet District Latest News

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు చనిపోగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిమ్మాపురం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two-wheeler collided and died
ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి
author img

By

Published : Jan 22, 2021, 8:52 AM IST

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు చనిపోగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగింది.

స్వగ్రామానికి వస్తుండగా..

వీర్యానాయక్ తండాలోని లకావత్ నితిన్ (19), సూర్యానాయక్ తండాకు చెందిన లునావత్ భాస్కర్..​ సూర్యాపేట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నారు. తిమ్మాపురం సమీపంలో కేతెపల్లి మండలం కొత్తపేటవాసి తండు సందీప్.. జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

నితిన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సందీప్, భాస్కర్​కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు చనిపోగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగింది.

స్వగ్రామానికి వస్తుండగా..

వీర్యానాయక్ తండాలోని లకావత్ నితిన్ (19), సూర్యానాయక్ తండాకు చెందిన లునావత్ భాస్కర్..​ సూర్యాపేట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నారు. తిమ్మాపురం సమీపంలో కేతెపల్లి మండలం కొత్తపేటవాసి తండు సందీప్.. జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

నితిన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సందీప్, భాస్కర్​కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.