ETV Bharat / crime

డీసీఎం, ట్రాక్టర్​ ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : Apr 12, 2021, 12:24 PM IST

Updated : Apr 12, 2021, 3:14 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, ట్యాంకర్​ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident in chennoor
చెన్నూర్​లో రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై డీసీఎం, ట్రాక్టర్​ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మరో వ్యక్తి.. ట్రాక్టర్​పై చెన్నూర్​ వైపు వస్తుండగా కోటపల్లి వైపు వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది.

ఘటనలో ట్రాక్టర్​పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

జాతీయ రహదారిపై డీసీఎం, ట్రాక్టర్​ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మరో వ్యక్తి.. ట్రాక్టర్​పై చెన్నూర్​ వైపు వస్తుండగా కోటపల్లి వైపు వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది.

ఘటనలో ట్రాక్టర్​పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

Last Updated : Apr 12, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.