ETV Bharat / crime

గిరిజన యువతిపై హత్యాచారం.. నిందితుడు అరెస్టు

author img

By

Published : May 30, 2021, 6:58 PM IST

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై హత్యాచారం కేసును పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఓ బైక్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరించారు.

minor girl rape murder case mahabubabad
గిరిజన యువతిపై అత్యాచారం, హత్య కేసు నిందితుడు అరెస్టు

మహబూబాబాద్​ జిల్లాలో గిరిజన యువతిని అత్యాచారం చేసి హతమార్చిన కేసులో పోలీసులు నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం తండా శివారులో గిరిజన మైనర్ బాలికపై శనివారం హత్యాచారం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రాజేశ్​ను అరెస్ట్ చేసి, ఓ బైక్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్​లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.

సంబంధిత కథనం: గిరిజన యువతిపై అత్యాచారం... హత్య

సీతారాంపురం తండాకు చెందిన మైనర్ బాలిక.. పక్కనే ఉన్న తండా ధర్మారంకు చెందిన రాజేశ్​లు గత మూడు నెలలుగా చనువుగా ఉంటున్నారు. వారి పెళ్లికి బాలిక ఇంట్లో ఒప్పుకోలేదు. వారు మాత్రం ఫోన్​లో మాట్లాడుకుంటున్నారు. శనివారం రోజు బాలిక సోదరుడు హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాజేశ్​ బాలికకు ఫోన్ చేసి ఎస్సార్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న మొండికట్ట గుట్ట వద్దకు రావాలని చెప్పడం వల్ల ఆమె అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది. ఇద్దరూ గుట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత… శారీరకంగా కలుద్దామని అడుగగా తనకు భయం వేస్తోందని.. ఎప్పుడూ అలా చెయ్యలేదని చెప్పగా రాజేశ్​ బలవంతంగా అత్యాచారం చేశాడు.

బాలికకు రక్తస్రావం అయి స్పృహ తప్పి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే నిందితుడు రాజేశ్..​ శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను ఆ బాలిక బావ శంకర్​కు విషయం తెలిపాడు. శంకర్ వెంటనే అక్కడకు రాగా… శ్రీను, శంకర్​లు ఆ బాలికను బైక్​పై పురుషోత్తమయ గూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. కానీ అప్పటికే ఆ బాలిక చనిపోయిందని ఆర్​ఎంపీ చెప్పాడు. దీంతో నిందితుడు రాజేశ్​ పరారయ్యాడు.

పోలీసులు విస్తృతంగా గాలించి నిందితుడు రాజేశ్​ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఓ బైక్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. లాక్​డౌన్ సమయంలో విద్యార్థులంతా ఆన్​లైన్ క్లాసుల పేరుతో సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లలో నిమగ్నమై ఉంటున్నారని… తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మరిపెడ సీఐ సాగర్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో శిశువు, బాలింత మృతి

మహబూబాబాద్​ జిల్లాలో గిరిజన యువతిని అత్యాచారం చేసి హతమార్చిన కేసులో పోలీసులు నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం తండా శివారులో గిరిజన మైనర్ బాలికపై శనివారం హత్యాచారం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రాజేశ్​ను అరెస్ట్ చేసి, ఓ బైక్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్​లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.

సంబంధిత కథనం: గిరిజన యువతిపై అత్యాచారం... హత్య

సీతారాంపురం తండాకు చెందిన మైనర్ బాలిక.. పక్కనే ఉన్న తండా ధర్మారంకు చెందిన రాజేశ్​లు గత మూడు నెలలుగా చనువుగా ఉంటున్నారు. వారి పెళ్లికి బాలిక ఇంట్లో ఒప్పుకోలేదు. వారు మాత్రం ఫోన్​లో మాట్లాడుకుంటున్నారు. శనివారం రోజు బాలిక సోదరుడు హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాజేశ్​ బాలికకు ఫోన్ చేసి ఎస్సార్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న మొండికట్ట గుట్ట వద్దకు రావాలని చెప్పడం వల్ల ఆమె అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది. ఇద్దరూ గుట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత… శారీరకంగా కలుద్దామని అడుగగా తనకు భయం వేస్తోందని.. ఎప్పుడూ అలా చెయ్యలేదని చెప్పగా రాజేశ్​ బలవంతంగా అత్యాచారం చేశాడు.

బాలికకు రక్తస్రావం అయి స్పృహ తప్పి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే నిందితుడు రాజేశ్..​ శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను ఆ బాలిక బావ శంకర్​కు విషయం తెలిపాడు. శంకర్ వెంటనే అక్కడకు రాగా… శ్రీను, శంకర్​లు ఆ బాలికను బైక్​పై పురుషోత్తమయ గూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. కానీ అప్పటికే ఆ బాలిక చనిపోయిందని ఆర్​ఎంపీ చెప్పాడు. దీంతో నిందితుడు రాజేశ్​ పరారయ్యాడు.

పోలీసులు విస్తృతంగా గాలించి నిందితుడు రాజేశ్​ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఓ బైక్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. లాక్​డౌన్ సమయంలో విద్యార్థులంతా ఆన్​లైన్ క్లాసుల పేరుతో సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లలో నిమగ్నమై ఉంటున్నారని… తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మరిపెడ సీఐ సాగర్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో శిశువు, బాలింత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.