ETV Bharat / crime

ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి - ap latest news

కళాశాలకని బయలుదేరిన ఆ విద్యార్థిని.. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. నవ్వుతూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె తిరగిరాని లోకాలకు వెళ్లిందని.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

dead
dead
author img

By

Published : Feb 22, 2021, 1:35 PM IST

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. రెవెన్యూ క్వార్టర్స్​కు చెందిన జువేరియా.. ఓ కళాశాలలో బైపీసీ మెుదటి సంవత్సరం చదువుతోంది.

కళాశాలకని స్కూటీపై బయలుదేరిన జువేరియాను.. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె మృతి చెందిందని తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. రెవెన్యూ క్వార్టర్స్​కు చెందిన జువేరియా.. ఓ కళాశాలలో బైపీసీ మెుదటి సంవత్సరం చదువుతోంది.

కళాశాలకని స్కూటీపై బయలుదేరిన జువేరియాను.. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె మృతి చెందిందని తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒకరి అజాగ్రత్త.. మరొకరి అతివేగం.. ఫలితం రోడ్డుప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.