ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. రెవెన్యూ క్వార్టర్స్కు చెందిన జువేరియా.. ఓ కళాశాలలో బైపీసీ మెుదటి సంవత్సరం చదువుతోంది.
కళాశాలకని స్కూటీపై బయలుదేరిన జువేరియాను.. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె మృతి చెందిందని తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఒకరి అజాగ్రత్త.. మరొకరి అతివేగం.. ఫలితం రోడ్డుప్రమాదం