ETV Bharat / crime

Gold seize: భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత

author img

By

Published : Jun 12, 2021, 7:35 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న పంచలింగాల చెక్​పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు.

huge gold seized in kurnool
కర్నూలులో బంగారం పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో ఓ బంగారం దుకాణంలో పనిచేసే సత్యనారాయణ... హైదరాబాద్ నుంచి ఒక కేజీ 818 గ్రాముల బంగారు అభరణాలను ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

పోలీసులు సోదాల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని ఎస్​ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. బంగారు ఆభరణాలను సీజ్ చేసి తాలూకా పోలీసులకు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో ఓ బంగారం దుకాణంలో పనిచేసే సత్యనారాయణ... హైదరాబాద్ నుంచి ఒక కేజీ 818 గ్రాముల బంగారు అభరణాలను ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

పోలీసులు సోదాల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని ఎస్​ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. బంగారు ఆభరణాలను సీజ్ చేసి తాలూకా పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.