ETV Bharat / crime

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

author img

By

Published : Jun 1, 2021, 3:03 PM IST

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

road accident
road accident

వేగంగా వచ్చిన ఓ బొలెరో.. బైక్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో ఇది జరిగింది.

కోమటికుంట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తోన్న గోపాల్ (40).. స్కూల్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్ల కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపాల్ మృతితో.. తోటి ఉద్యోగస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వేగంగా వచ్చిన ఓ బొలెరో.. బైక్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో ఇది జరిగింది.

కోమటికుంట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తోన్న గోపాల్ (40).. స్కూల్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్ల కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపాల్ మృతితో.. తోటి ఉద్యోగస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Murder: గుర్తు తెలియని వ్యక్తుల దాడితో యువకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.