ETV Bharat / crime

భారీ అగ్నిప్రమాదం... 10 గడ్డివాములు దగ్ధం

author img

By

Published : Mar 31, 2021, 9:25 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటుకొని 10 గడ్డివాములు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire-accident-in-paltur-ananthapuram-district
పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటుకొని 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామ సమీపంలో ఒకే చోట రైతులు 50కి పైగా గడ్డి వాములు వేసుకున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. వాటిని అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డి నిల్వలు పూర్తిగా కాలిపోయి పశువులకు మేత లేకుండా పోయిందని రైతులు వాపోయారు. దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలోని పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

ఇదీ చదవండి: విధి నిర్వహణలో గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటుకొని 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామ సమీపంలో ఒకే చోట రైతులు 50కి పైగా గడ్డి వాములు వేసుకున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. వాటిని అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డి నిల్వలు పూర్తిగా కాలిపోయి పశువులకు మేత లేకుండా పోయిందని రైతులు వాపోయారు. దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలోని పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

ఇదీ చదవండి: విధి నిర్వహణలో గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.