ETV Bharat / crime

అత్తతో వివాహేతర సంబంధం.. అల్లుడిని హతమార్చిన మామ

author img

By

Published : May 1, 2021, 11:14 AM IST

అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు అల్లుడు. అతని మామే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.

murder in ap
అనంతపురం జిల్లాలో అల్లుడిని హతమార్చిన మామ

పిల్లనిచ్చిన అత్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో అల్లుడు. అతని తీరు మారకపోవడంతో స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మామే కర్రతో దాడి చేసి హతమార్చాడు. ఉరవకొండ మండలం వై.రాంపురంలో జరిగిన హత్య కేసులో నిందితుడు ఎర్రిస్వామిని రామసాగరం క్రాస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మామే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. హత్యకు గల కారణాలను ఉరవకొండ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు వివరించారు.

వివరాల్లోకి వెళితే…

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి (35), ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలంగా అత్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అనుమానం పెంచుకున్న మామ ఎర్రిస్వామి అల్లుడి కదలికలపై నిఘా పెట్టాడు. గతనెల 28 న రాత్రి మామ, అల్లుడు కలిసి బెళుగుప్ప మండలం దుద్దేకుంటలో పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి నుంచి మధ్యలోనే వన్నూరుస్వామి తన అత్త దగ్గరకు వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా రాంపురం వద్ద మామ ఎర్రిస్వామి కాపుకాసి.. కర్రతో బలంగా కొట్టి అల్లుడిని హత్య చేసి.. పరారయ్యాడు. మృతుడి బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని అతని మామే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు

ఇదీ చదవండి: ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ వ్యాపారం.. ఇద్దరు అరెస్ట్

పిల్లనిచ్చిన అత్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో అల్లుడు. అతని తీరు మారకపోవడంతో స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మామే కర్రతో దాడి చేసి హతమార్చాడు. ఉరవకొండ మండలం వై.రాంపురంలో జరిగిన హత్య కేసులో నిందితుడు ఎర్రిస్వామిని రామసాగరం క్రాస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మామే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. హత్యకు గల కారణాలను ఉరవకొండ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు వివరించారు.

వివరాల్లోకి వెళితే…

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి (35), ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలంగా అత్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అనుమానం పెంచుకున్న మామ ఎర్రిస్వామి అల్లుడి కదలికలపై నిఘా పెట్టాడు. గతనెల 28 న రాత్రి మామ, అల్లుడు కలిసి బెళుగుప్ప మండలం దుద్దేకుంటలో పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి నుంచి మధ్యలోనే వన్నూరుస్వామి తన అత్త దగ్గరకు వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా రాంపురం వద్ద మామ ఎర్రిస్వామి కాపుకాసి.. కర్రతో బలంగా కొట్టి అల్లుడిని హత్య చేసి.. పరారయ్యాడు. మృతుడి బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని అతని మామే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు

ఇదీ చదవండి: ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ వ్యాపారం.. ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.